ICC T20 : పాక్ విజయంపై సంబరాలు చేసుకుంటే..దేశ ద్రేహం కేసులు

టీ వరల్డ్ కప్ మ్యాచ్ లో భారత్ పై పాకిస్తాన్ గెలిచిందని సంబరాలు చేసుకుంటే..వారిపై దేశద్రోహం కేసులు పెడుతామని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ హెచ్చరించారు.

ICC T20 : పాక్ విజయంపై సంబరాలు చేసుకుంటే..దేశ ద్రేహం కేసులు

Yogi

CM Yogi Adityanath : టీ వరల్డ్ కప్ మ్యాచ్ లో భారత్ పై పాకిస్తాన్ గెలిచిందని సంబరాలు చేసుకుంటే..వారిపై దేశద్రోహం కేసులు పెడుతామని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ హెచ్చరించారు. అక్టోబర్ 24వ తేదీన భారత్ – పాక్ జట్ల మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో భారత్ ఘోరపరాజయం చెందింది. దీంతో కొందరు సంబరాలు చేసుకున్నారు. ఇటీవలే ఓ టీచర్ పాక్ క్రీడాకారులకు సంబంధించి ఫొటోలను వాట్సాప్ స్టేటస్ గా పెట్టుకోవడంతో..ఆమెను ఉద్యోగం నుంచి తొలగించారు.

Read More : Pakistan Coach: పాకిస్తాన్ కోచ్‌గా టీమిండియా మాజీ హెడ్ కోచ్

అంతేగాకుండా..దేశ వ్యతిరేక నినాదాలు చేసిన కాశ్మీర్ కు చెందిన ముగ్గురు ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థులను ఆగ్రాలో అరెస్టు చేశారు. ముగ్గురు విద్యార్థులపై బీజేపీ నేతలు పీఎస్ లో ఫిర్యాదు చేశారు. వీరిని కాలేజీ అధికారులు సస్పెండ్ చేశారు. ఈ క్రమంలో..సీఎం యోగి ఆదిత్యనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. యూపీలోని ఐదు జిల్లాల్లో ఏడుగురిపై కేసులు నమోదు చేశారు.

Read More : Crusi Drug Case : అమాయకులను అరెస్టు చేశారు..మరో బాంబు పేల్చిన నవాబ్ మాలిక్!

హిందూ సంస్థలకు చెందిన సభ్యులు విద్యార్థుల చర్యలకు నిరసనగా…పలు హిందూ సంస్థలకు చెందిన సభ్యులు క్యాంపస్ లోకి వచ్చి ఆందోళన చేపట్టారని కాలేజీ ఫ్యాకల్టీ సభ్యులు తెలిపారు. దేశ వ్య‌తిరేక చ‌ర్య‌ల‌కు పాల్ప‌డితే ఉపేక్షించ‌బోమ‌ని, విచార‌ణ అనంత‌రం ముగ్గురు క‌శ్మీరీ విద్యార్థుల‌ను అరెస్టు చేశామని వెల్లడించారు ఆగ్రా ఎస్పీ. ఆదివారం నాడు జరిగిన ఐసీసీ టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ లో భారత్ పై పాక్ పది వికెట్ల తేడాతో గెలుపొందింది.