హైడ్రాక్సీక్లోరోక్విన్ వాడకంపై ICMR కీలక సిఫార్సులు

  • Published By: venkaiahnaidu ,Published On : May 23, 2020 / 06:48 AM IST
హైడ్రాక్సీక్లోరోక్విన్ వాడకంపై ICMR కీలక సిఫార్సులు

కరోనా వైరస్ రాకుండా అడ్డుకునేందుకు ప్రొఫైలాక్టిక్ మెడిసిన్ గా హెల్త్ వర్కర్లు, కరోనా పేషెంట్ల కుటుంబ సభ్యులు యాంటీ మలేరియా డ్రగ్ హైడ్రాక్సీక్లోరోక్విన్ వాడవచ్చని ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ICMR )సూచించింది. హైడ్రాక్సీ క్వోరోక్విన్ మాత్రలు తీసుకుంటే కొవిడ్-19 వైరస్ బారిన పడే అవకాశాలను తగ్గిస్తుందని కనుగొన్న ఐసీఎంఆర్… తాజా ఆదేశాల్లో COVID-19 హాస్పిటల్స్ లో పనిచేసే ఆరోగ్య సంరక్షణ కార్మికులు, కంటైనేషన్ జోన్లలో నిఘా విధిపై పనిచేసే ఫ్రంట్‌లైన్ సిబ్బంది, కరోనావైరస్ సంక్రమణ సంబంధిత కార్యకలాపాలలో పాల్గొనే పారామిలిటరీ లేదా పోలీసు సిబ్బందికి నివారణ మందుగా హైడ్రాక్సీక్లోరోక్విన్‌(HCQ)ను ఉపయోగించాలని ICMR సిఫార్సు చేసింది.

ఇప్పటికే హెల్త్ వర్కర్లకు ఏడు వారాల పాటు ఈ మందును ఇచ్చి పరిశీలించారు. మంచి ఫలితాలిచ్చినట్టు గుర్తించారు. ఆ అధ్యయనాకి సంబంధించిన మధ్యంతర రిపోర్ట్ ను కమ్యూనిటీ మెడిసిన్ డిపార్ట్ మెంట్ ప్రభుత్వానికి అందజేసింది. క్లోరోక్విన్ ఎఫెక్ట్ లను స్టడీ చేసేందుకు 533 మంది హెల్త్ వర్కర్లకు హైడ్రాక్సీక్లోరోక్విన్ ను ఇచ్చారు. అందులో కరోనా పేషెంట్లను దగ్గరగా ఉండి ట్రీట్ చేసిన డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది 394 మంది ఉన్నారు. వాళ్లపై మందు పనితీరును ఏడు వారాల పాటు పరిశీలించారు.

కరోనా లక్షణాలైన జ్వరం, గొంతు నొప్పి, దగ్గు వంటివి రాలేదని నిర్ధారించారు. 93 మందికి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయని నివేదికలో తెలిపారు. అయితే, ఇది మధ్యంతర నివేదిక మాత్రమేనని, తుది నివేదిక కాదని రిపోర్ట్ లో తెలిపారు. కాగా,దేశంలో ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 1,25,101కి చేరింది. మొత్తం మృతుల సంఖ్య 3,720కి చేరింది.

ఇప్పటివరకు భారత్ లో కరోనా నుంచి కోలుకున్న 51,783 మంది హాస్పిటల్స్ నుంచి డిశ్చార్జి అయ్యారు.  ప్రస్తుతం దేశంలో 69,597 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. దేశంలో మహారాష్ట్ర, గుజరాత్‌, తమిళనాడు రాష్ట్రాల్లో అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 53లక్షలు దాటింది. దాదాపు 3లక్షల 40వేల మంది ప్రాణాలు కోల్పోయారు.

Read: 4ఏళ్ల బాలుడి ప్రాణాలు నిలిపిన ‘Bone Marrow’ దాతను తొలిసారి కలిసిన వేళ..