ICU at Home services : ముంబైలో ఇంటి దగ్గరకే ఐసీయూ సర్వీసులు

ICU at Home services : ముంబైలో ఇంటి దగ్గరకే ఐసీయూ సర్వీసులు

Icu At Home Services

ICU at Home services in Mumbai : మహారాష్ట్రలోని ముంబైలో కరోనా విలయతాండవం చేస్తోంది. ఈ ఉదృతికి హాస్పిటల్స్ అన్నీ ఫుల్ అయిపోయాయి. బెడ్స్ కూడా లేవు. దీంతో కరోనా సోకినవారి కోసం ముంబైలో కొత్త సేవల్ని ప్రారంభించారు. ఇంటి వద్దకే ఐసీయూలో కొత్త సేవల్ని ప్రారంభించారు. ‘ఐసీయూ ఎట్ హోమ్’ పేరుతో ఈ సర్వీసులు ప్రారంభించారు.

ఈ సేవల్లో భాగంగా సేవలు చేసేందుకు నర్సులు, ఆక్సిజన్, ఫిజియో థెరపిస్ట్ అన్నీ ఇంటి వద్దకే వస్తారు. ఇలా ఇంటి వద్దకే అందించే ఐసీయూ సేవలను బట్టి రూ. 1,500 నుంచి రూ. 15,000 వరకు ఛార్జి చేస్తారు. మహారాష్ట్రలో కరోనా కేసులు ఊహించని విధంగా పెరిగిపోతుండటంతో… ఆసుపత్రుల్లో బెడ్లు, ఆక్సిజన్ కు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఆసుపత్రుల్లో కరోనా పేషెంట్లకు బెడ్లు కూడా దొరకని పరిస్థితి పలు ఆస్పత్రుల్లో ఉంది. ముఖ్యంగా ముంబైలో ఈ పరిస్థితి మరీ దారుణంగా ఉంది.

ఈ క్రమంలో కరోనా సోకినవారి కోసం ముంబైలో సరికొత్త సేవలు అందుబాటులోకి వచ్చాయి. ‘ఐసీయూ ఎట్ హోమ్ సర్వీస్’ పేరుతో సేవలు ప్రారంభమయ్యాయి. దీని ద్వారా నర్సులు, మెడిసిన్, ఆన్ లైన్ కన్సల్టేషన్, ఆక్సిజన్, ఫిజియోథెరపిస్ట్ వంటి సేవలు ఇంటి వద్దకే వస్తాయి. ఈ సేవలు కావాలనుకునే వారు సర్వీసులను బట్టి రోజుకు రూ. 1,500 నుంచి రూ. 15,000 వరకు చెల్లించాల్సి ఉంటుంది.

మరోవైపు..కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో మహారాష్ట్రలో మెడికల్ ఆక్సిజన్ కు కొరత ఏర్పడుతోంది. ఆక్సిజన్ కు డిమాండ్ పెరిగటంతో సరఫరా చేయలేక చేతులెత్తేస్తున్నారు. ఈ క్రమంలో మెడికల్ ఆక్సిజన్ సరఫరా చేయాలని పక్క రాష్ట్రాలను కోరామని మహారాష్ట్ర ఆరోగ్యమంత్రి రాజేశ్ తోపే తెలిపారు. మెడికల్ ఆక్సిజన్ కొరత ఉన్న క్రమంలో ఆక్సిజన్ ను వృథా చేయడాన్ని వీలైనంతగా తగ్గించాలని కోరారు.

మెడికల్ ఆక్సిజన్ కొరతపై మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఓ పక్క ఆక్సిజన్ కొరత మరోపక్క పెరుగుతున్న కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఎయిర్ ఫోర్స్ విమానాల ద్వారా మెడికల్ ఆక్సిజన్ ను మహారాష్ట్రకు సరఫరా చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు సీఎం ఉద్ధవ్ థాక్రే.