ఉపశమనం కలిగించే విషయం: కరోనా నుంచి కోలుకుంటున్నవారే ఎక్కువ

  • Published By: vamsi ,Published On : June 22, 2020 / 03:33 AM IST
ఉపశమనం కలిగించే విషయం: కరోనా నుంచి కోలుకుంటున్నవారే ఎక్కువ

భారతదేశంలో కరోనావైరస్ కొత్త కేసులు పెరిగిపోతూ ఉన్నాయి. లేటెస్ట్‌గా కరోనా సోకిన రోగుల సంఖ్య దేశంలో నాలుగు లక్షలు దాటింది. అయితే, ఈ రోగులలో సగానికి పైగా పూర్తిగా కోలుకోవడం ఉపశమనం కలిగించే విషయం.

ఇప్పటివరకు దేశంలో మొత్తం 68 లక్షల మందికి పైగా కరోనా పరీక్షలు చేశారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం, దేశంలో కరోనా వైరస్ సోకినవారిలో 55.49 శాతం మంది రోగులు కోలుకున్నారు. 

దేశంలో ఆదివారం ఒకే రోజు 15 వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి మరియు మూడు వందలకు పైగా రోగులు ప్రాణాలు కోల్పోయారు. దేశంలో మొత్తం కరోనా ఇన్ఫెక్షన్ల సంఖ్య 4,10,461 కు పెరిగింది. వీరిలో 2,27,755 మంది రోగులు పూర్తిగా కోలుకున్నారు. ఇప్పటివరకు 13,254 మంది చనిపోగా.. 1,69,451 క్రియాశీల కేసులు మిగిలి ఉన్నాయి.

Read: వాటే ఐడియా సర్ జీ : చేయి చాపండి..గుళ్లో..తీర్థం పోస్తున్న మెషిన్