BJP Govt: నాలుగన్నరేళ్ల బీజేపీ పాలనలో ఒక్క ఆందోళన కూడా లేదు – సీఎం

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ముందు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. నాలుగన్నరేళ్ల కాలంలో తమ ప్రభుత్వం సాధించిన..

BJP Govt: నాలుగన్నరేళ్ల బీజేపీ పాలనలో ఒక్క ఆందోళన కూడా లేదు – సీఎం

Up Cm Yogi

BJP Govt: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ముందు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. నాలుగన్నరేళ్ల కాలంలో తమ ప్రభుత్వం సాధించిన విజయాలను హైలెట్ చేసుకుంటూ మాట్లాడారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర యూనిట్ ఈ కాలాన్ని భారీగా సెలబ్రేట్ చేసుకుంటుందని అన్నారు.

ఉత్తరప్రదేశ్ నేషనల్ ర్యాంకింగ్ లో రెండో స్థానానికి చేరిందని.. ఈ కాలంలో వ్యవహారాలు చాలా సజావుగా కొనసాగుతున్నాయని లక్నో వేదికగా జరిగిన కార్యక్రమంలో అన్నారు.

గత ప్రభుత్వాలను టార్గెట్ చేస్తూ.. అల్లర్లు అనేది ప్రస్తుతం ఓ ట్రెండ్ గా మారిపోయిందని యూపీ సీఎం అన్నారు. అలాంటిది బీజేపీ పాలించడం మొదలుపెట్టిన నాలుగన్నరేళ్ల కాలంలో ఒక్క ఆందోళన కూడా జరగలేదని అన్నారు.

‘రాష్ట్రంలో నాలుగన్నరేళ్ల పదవి కాలం పూర్తి చేసుకుంటుండగా ముఖ్యమైన విషయమేంటంటే ఇక్కడ సెక్యూరిటీ, మంచి పాలన అందించగల్గుతున్నాం. రాష్ట్ర ఆలోచనా తీరు మారుతుంది. గతంలో అల్లర్లు అనేది యూపీలో ట్రెండింగ్ గా ఉండేవి. కానీ, బీజేపీ ఉన్న నాలుగన్నరేళ్ల కాలంలో ఒక్కటి కూడా అలాంటిది జరగలేదు’ అని సీఎం అన్నారు.

Online Auction : ఒక్క రూపాయి ఎంతకు అమ్ముడుపోయిందో తెలుసా..ఒక్క నాణెం మిలియనీర్‌‌ను చేసింది

2017లో అధికారంలోకి వచ్చిన యోగి ప్రభుత్వం.. నేటితో 54నెలలు పూర్తి చేసుకుంది. 4.5సంవత్సరాలు పూర్తి చేసుకున్నామని తెలియడం కోసం బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు 27వేల శక్తి కేంద్రాల్లో సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ లక్ష్యాలు ప్రచారం చేసే పనిలో ఉన్నారు.