Foreign Made Vaccines : వ్యాక్సిన్ కొరతను అధిగమించేందుకు కేంద్రం కీలక నిర్ణయం
దేశంలో క్రమంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. సెకండ్ వేవ్ లో వైరస్ మరింతగా విజృంభిస్తోంది. రోజువారీ కేసులు పెరుగుతుండటంతో యాక్టివ్ కేసులూ పెరుగుతున్నాయి. ఈ క్రమంలో కేంద్రం వ్యాక్సినేషన్ ప్రక్రియను ముమ్మరం చేసింది. దేశ ప్రజంలందరికి టీకాలు ఇవ్వాలని నిర్ణయించింది. అయితే.. వ్యాక్సినేషన్ కు అడ్డంకులు ఎదురవుతున్నాయి. దేశంలో వ్యాక్సిన్ కొరత ఏర్పడింది.
Foreign Made Vaccines : దేశంలో క్రమంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. సెకండ్ వేవ్ లో వైరస్ మరింతగా విజృంభిస్తోంది. రోజువారీ కేసులు పెరుగుతుండటంతో యాక్టివ్ కేసులూ పెరుగుతున్నాయి. ఈ క్రమంలో కేంద్రం వ్యాక్సినేషన్ ప్రక్రియను ముమ్మరం చేసింది. దేశ ప్రజంలందరికి టీకాలు ఇవ్వాలని నిర్ణయించింది. అయితే.. వ్యాక్సినేషన్ కు అడ్డంకులు ఎదురవుతున్నాయి. దేశంలో వ్యాక్సిన్ కొరత ఏర్పడింది.
ఈ క్రమంలో కరోనా వ్యాక్సిన్ కొరతను అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా విదేశీ వ్యాక్సిన్లకూ అనుమతి ఇవ్వాలని భావిస్తోంది. ఇప్పటికే వివిధ దేశాల్లో ఆమోదం పొందిన టీకాలకు అనుమతులు ఇచ్చే ప్రక్రియను వేగవంతం చేయాలని నిర్ణయించింది. దీంతో అత్యవసర వినియోగానికి వేగంగా అనుమతులు ఇచ్చేందుకు సన్నద్ధం అయ్యింది. భారత్లో ఇప్పటికే మూడు టీకాలు(కొవిషీల్డ్-సీరమ్, కొవాగ్జిన్-భారత్ బయోటెక్, స్పుత్నిక్ వి-రష్యా) అనుమతులు పొందాయి. కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయంతో మరికొద్ది రోజుల్లోనే మరిన్ని టీకాలు కూడా అందుబాటులోకి రానున్నాయి.
ప్రపంచ ఆరోగ్యసంస్థ జాబితాలో ఉన్న అమెరికా ఎఫ్డీఏ, ఈఎంఏ, బ్రిటన్ ఎంహెచ్ఆర్ఏ, పీఎండీఏ జపాన్ వంటి విదేశీ ఔషధ నియంత్రణ సంస్థలు ఇప్పటికే ఆయా దేశాల్లో పలు వ్యాక్సిన్లకు ఆమోదం తెలిపాయి. ఇలా ఆమోదం తెలిపిన వ్యాక్సిన్లకు భారత్లో అత్యవసర వినియోగం కింద అనుమతి ఇచ్చేందుకు వ్యాక్సిన్లపై ఏర్పాటు చేసిన జాతీయ నిపుణుల బృందం సిఫార్సు చేసింది. విదేశాల్లో అనుమతి పొందిన టీకాలను భారత్లో అనుమతించే ముందు.. తొలుత 100మంది లబ్ధిదారులకు ఇచ్చి వాటి భద్రత ఫలితాలపై వారం పాటు విశ్లేషిస్తాము’ అని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ వేగంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు 10.85 కోట్ల వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేశారు. వ్యాక్సిన్ కొరత ఉందని పలు రాష్ట్రాలు కేంద్రానికి విన్నవిస్తున్నాయి. దీంతో దేశీయంగా వ్యాక్సిన్ ఉత్పత్తిని పెంచడంతో పాటు వివిధ దేశాల్లో అనుమతి పొందిన టీకాలకు అత్యవసర వినియోగానికి అనుమతించి, కొరతను అధిగమించవచ్చని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్-వి టీకాకు డీసీజీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరికొన్ని నెలల్లోనే జాన్సన్ అండ్ జాన్సన్, జైడస్ క్యాడిలా, నోవావాక్స్, భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన (ముక్కు ద్వారా తీసుకునే) టీకాలు అందుబాటులోకి రానున్నాయి.
విదేశాల్లో అభివృద్ధి చేసిన టీకాలు భారత్లో అనుమతి పొందాలంటే ఇక్కడే రెండో, మూడో దశ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించాల్సి ఉంటుంది. దీంతో స్పుత్నిక్-వి, నోవావాక్స్ టీకాల ప్రయోగాలు భారత్లో చేపట్టాయి. అందువల్ల ఇవి విదేశాల్లో అనుమతులు పొందినప్పటికీ వాటిని భారత్లో వినియోగించడంలో కొంత ఆలస్యం అవుతోంది. ఈ నేపథ్యంలో వీటి ప్రయోగాలు, ఫలితాల విశ్లేషణ ప్రక్రియను వేగవంతం చేయాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది.
ఇప్పటికే రష్యాకు చెందిన ఆర్డీఐఎఫ్ అభివృద్ధి చేసిన టీకాకు అత్యవసర వినియోగ అనుమతిని భారత ఔషధ నియంత్రణ మండలి(డీసీజీఐ) ఇచ్చింది. ఈ నేపథ్యంలో దేశీయంగా ఏడాదికి 85 కోట్ల వ్యాక్సిన్ డోస్లను ఉత్పత్తి చేయనున్నారు. ఇప్పటికే 59 దేశాల్లో స్పుత్నిక్-వి టీకాను అనుమతించారు. భారత్ ఆ టీకాను ఉపయోగించే 60వ దేశమైంది. ఏప్రిల్ చివరి నాటికి స్పుత్నిక్ వ్యాక్సిన్ భారత్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.