India Corona : ఇండియాకు రిలీఫ్.. కరోనా కొత్త కేసుల కంటే రికవరీలే ఎక్కువ.. ఆంక్షలు పని చేస్తున్నాయి..

దేశవ్యాప్తంగా కరోనావైరస్ కట్టడికి పలు రాష్ట్రాలు విధించిన ఆంక్షలు పనిచేస్తున్నట్లే కనిపిస్తున్నాయి. కొన్నిరోజుల క్రితం 4 లక్షల మార్కును దాటిన రోజువారీ కేసులు.. ఐదు రోజులుగా ఆ మార్కుకు దిగువన నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 3.43లక్షల మంది కరోనా బారిన పడ్డారు. మరణాల సంఖ్య 4వేలుగా ఉంది. ఈ మేరకు శుక్రవారం(మే 14,2021) ఉదయం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. నిన్నటితో పోల్చితే కేసులు, మరణాల సంఖ్యలో కూడా తగ్గుదల కనిపిస్తోంది.

India Corona : ఇండియాకు రిలీఫ్.. కరోనా కొత్త కేసుల కంటే రికవరీలే ఎక్కువ.. ఆంక్షలు పని చేస్తున్నాయి..

India Coronavirus Live Updates

India Corona : దేశవ్యాప్తంగా కరోనావైరస్ కట్టడికి పలు రాష్ట్రాలు విధించిన ఆంక్షలు పనిచేస్తున్నట్లే కనిపిస్తున్నాయి. కొన్నిరోజుల క్రితం 4 లక్షల మార్కును దాటిన రోజువారీ కేసులు.. ఐదు రోజులుగా ఆ మార్కుకు దిగువన నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 3.43లక్షల మంది కరోనా బారిన పడ్డారు. మరణాల సంఖ్య 4వేలుగా ఉంది. ఈ మేరకు శుక్రవారం(మే 14,2021) ఉదయం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. నిన్నటితో పోల్చితే కేసులు, మరణాల సంఖ్యలో కూడా తగ్గుదల కనిపిస్తోంది.

తాజాగా 18లక్షల 75వేల 515 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..3లక్షల 43వేల 144 మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. క్రితం రోజు(3,62,727)తో పోల్చుకుంటే కొత్త కేసులు కాస్త తగ్గాయి. దాంతో ఇప్పటివరకు 2 కోట్ల 40లక్షల మందికి ఈ మహమ్మారి సోకగా.. 2 కోట్ల మందికి పైగా దాన్నుంచి బయటపడ్డారు. నిన్న 3,44,776 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకూ కోలుకున్న వారి సంఖ్య 2,00,79,599గా ఉంది. 24 గంటల వ్యవధిలో కొత్త కేసుల కంటే రికవరీలే ఎక్కువగా ఉండటం ఊరటనిచ్చే అంశం. ప్రస్తుతం రికవరీ రేటు 83.50 శాతంగా ఉంది.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా 37,04,893 మంది కరోనాతో బాధపడుతన్నారు. యాక్టివ్ కేసుల రేటు 15.41 శాతంగా కొనసాగుతోంది. మరోవైపు, మరో 4వేల మంది కరోనాతో చనిపోయారు. మొత్తంగా 2,62,317 మంది ఈ వైరస్‌కు బలయ్యారు.