India Covid-19 : సూది అవసరం లేకుండానే చిన్నారులకు కరోనా టీకా
జైకోవ్- డీ టీకాను 12 ఏళ్లు పైబడిన వారికి ఇవ్వనున్నారు. గత ఆగస్టు 20వ తేదీనే ఇందుకు కేంద్రం ఆమోదం తెలిపింది.

Covid-19 Vaccine For Kids : దేశంలోని చిన్నారులకు టీకా ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఇప్పటికే దీనిపై కసరత్తు ప్రారంభించిన కేంద్రం… ఏడు రాష్ట్రాల్లో టీకా అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. జైడస్ క్యాడిలా రూపొందించిన జైకోవ్-డీ టీకాను ఫస్ట్ ఏడు రాష్ట్రాల్లో అందించనుంది. బీహార్, ఝార్ఖండ్, మహారాష్ట్ర, పంజాబ్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లోని చిన్నారులకు ఈ టీకాను వేయనున్నారు. సూది అవసరం కూడా లేకుండానే ఈ టీకా ఇవ్వనున్నారు. ఈ వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించి ఆయా రాష్ట్రాల్లోని ఆరోగ్య కార్యకర్తలకు శిక్షణ కూడా పూర్తి చేసినట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
Read More : AP CM Jagan : నేను ఉన్నా..రెండో రోజు వరద ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటన
జైకోవ్- డీ టీకాను 12 ఏళ్లు పైబడిన వారికి ఇవ్వనున్నారు. గత ఆగస్టు 20వ తేదీనే ఇందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. జైడస్ క్యాడిలా రూపొందించిన ఈ టీకా ప్రపంచంలో తొలి డీఎన్ఏ ఆధారిత కోవిడ్ టీకాగా నిలిచింది. వ్యాక్సినేషన్లో భాగంగా అందించేందుకు కోటి డోసుల కోసం కేంద్రం ఇప్పటికే ఆర్డర్ చేసింది. ప్రతి డోసుకు 265 రూపాయల చొప్పున కొనుగోలు చేసింది. సూది అవసరం లేకుండా చిన్నారులకు ఈ టీకాను ఇవ్వనున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా జెట్ అప్లికేటర్ అనే పరికరాన్ని వినియోగించనున్నారు. ఆ పరికరానికి మరో 93 రూపాయలు అదనంగా ఖర్చు కానుంది. దీంతో ఒక డోసు కోసం కేంద్రం 358 రూపాయలు ఖర్చు చేస్తోంది.
Read More : Electricity Charges : తెలంగాణలో త్వరలో కరెంటు చార్జీల పెంపు ?
మరోవైపు దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 125 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను అందజేసినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. వాటిలో 79.13 కోట్ల మంది అర్హులకు తొలిడోసు అందించగా… 45.8 కోట్ల మందికి పూర్తి మోతాదులో వ్యాక్సిన్ అందించామని తెలిపింది. ఇంటింటికి టీకా కార్యక్రమం మొదలుపెట్టిన తర్వాత వ్యాక్సిన్ పంపిణీలో మరింత వేగం పెరిగినట్టు తెలిపింది. అయితే బిహార్, ఝార్ఖండ్, మహారాష్ట్ర, పంజాబ్, తమిళనాడు, ఉత్తర్ప్రదేశ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో చాలా మంది ఇంకా తొలిడోసే తీసుకోలేదని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో సూది అవసరం లేకుండా ఇచ్చే జైకోవ్-డీ వ్యాక్సిన్ను ఆయా రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో తొలుత పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
- Covid-19 Vaccine : కొవిడ్ టీకా తీసుకున్నారా? రెండు డోసులకు ఒకటే మొబైల్ నెంబర్ తప్పనిసరి..!
- Oral Covid Vaccine: జబ్బు, వ్యాధి నుంచి ఓరల్ కొవిడ్ వ్యాక్సిన్ కాపాడుతుందంటోన్న స్టడీ
- Telangana Covid : తెలంగాణలో కరోనా.. కొత్త కేసులు
- India Covid-19 : 46 రోజుల తర్వాత.. దేశంలో 3వేల మార్క్ దాటిన కరోనా కేసులు!
- India Covid-19 : భారత్లో కరోనా విజృంభణ.. పెరుగుతున్న కొత్త కేసులు, మరణాలు
1IPL2022 Punjab Vs SRH : రాణించిన పంజాబ్ బౌలర్లు.. మోస్తరు స్కోరుకే హైదరాబాద్ పరిమితం
2Special Songs: క్యూ కడుతున్న స్టార్ హీరోయిన్స్.. స్పెషల్ సాంగ్కు ఓ లెక్కుంది!
3Tollywood Movies: టాలీవుడ్ను ఊరిస్తున్న ఊరమాస్.. ముందుంది అసలైన మాస్ జాతర
4Special Songs: స్టార్ డైరెక్టర్లే.. స్పెషల్ సాంగ్స్పై స్పెషల్ ఇంట్రెస్ట్!
5Srikakulam Crime: మురుగు కాలువ పైప్ గురించి గొడవ: శ్రీకాకుళంలో యువకుడిపై గునపంతో దాడి
6Helipad tour in Goa: ఆకాశంలో విహరిస్తూ గోవా బీచ్ అందాలు చూడొచ్చు: అందుబాటులోకి వచ్చిన హెలి టూరిజం
7Cars Collided: అంబులెన్సుకు దారి ఇస్తూ 7 కార్లు ఢీ
8Tomato : టొమాటోల్లోని సి విటమిన్ శరీరానికి అందాలంటే!
9Arjun Singh Rreturns to TMC: బెంగాల్లో బీజేపీకి షాక్.. టీఎమ్సీ గూటికి బీజేపీ ఎంపీ
10Watch Epic Video : పేపర్ రాకెట్తో గిన్నిస్ బుక్ రికార్డు బ్రేక్.. వీడియో వైరల్!
-
Vehicles in Goa: దేశంలోనే అధిక వాహనాలు ఉన్న రాష్ట్రం ‘గోవా’: ప్రమాదాలు, రద్దీ కూడా ఎక్కవ
-
Hot Water : అజీర్ణ సమస్యలు తొలగించే గోరువెచ్చని నీరు!
-
PM Modi : ఈనెల 23, 24న ప్రధాని మోదీ జపాన్ పర్యటన
-
Viral Video : హాలీవుడ్ సీన్ కాదు.. నిజంగానే భారీ మొసలి రోడ్డుపైకి వచ్చింది.. వీడియో..!
-
Pineapple : బరువు తగ్గించటంతోపాటు, బీపీని నియంత్రించే పైనాపిల్!
-
Jagityala : ఆడబిడ్డతో ఇంటికి వచ్చిన కోడలికి ఘనస్వాగతం పలికిన అత్త
-
India – China fight: చైనాకు చెక్ పెట్టేందుకు సిద్దమౌతున్న భారత్: నుబ్రా వ్యాలీ-డీబీఓ రోడ్డు పనులు వేగవంతం
-
Lorry Donate : తిరుమల శ్రీవారికి విరాళంగా కూరగాయల లారీ