Covid in India : ఢిల్లీలో 24 గంటల్లో 50 శాతం పెరిగిన కొవిడ్ కేసులు..

ఢిల్లీలో 24 గంటల్లో 50 శాతం కొవిడ్ కేసులు పెరిగాయి. దీంతో సమసిపోయింది అనుకున్న కోవిడ్ మహమ్మారి మరోసారి తన ప్రతాపాన్ని చూపుతోందా? అనే ఆందోళన మొదలైంది.

Covid in India : ఢిల్లీలో 24 గంటల్లో 50 శాతం పెరిగిన కొవిడ్ కేసులు..

India Covid

Covid in India : రెండేళ్ల నుంచి కోవిడ్ భయపెడుతునే ఉంది. కొత్త కొత్త వేరియంట్లుగా మారి హడలెత్తిస్తునే ఉంది. కోవిడ్ నియంత్రణకు భారత్ లో వ్యాక్సినేషన్ ప్రక్రియను పటిష్టంగా కొనసాగించింది కేంద్ర ప్రభుత్వం. దీంతో దేశంలో కరోనా వ్యాప్తి అదుపులోకి వచ్చింది. కేసులు గణనీయంగా తగ్గిపోయాకు. దీంతో కరోనా అదుపులోనే ఉంది. ఇక కోవిడ్ ముప్పు తప్పిందని దేశమంతా హాయిగా ఊపిరి పీల్చుకుంటోంది. ఈక్రమంలో తాజాగా మళ్లీ వెయ్యికి దగ్గర్లోనే కొత్త కేసులు నమోదయ్యాయి. దేశ రాజధాని దిల్లీలో 24 గంటల వ్యవధిలో 50 శాతం మేర అధికంగా కేసులు నమోదు కావటంతో మరోసారి ఆందోళన ప్రారంభమైంది.

కేసులు పెరుగుతున్న క్రమంలో ఢిల్లీలో ఒక్కరోజే అంటే 24 గంటల్లోనే పాజిటివిటీ రేటు పెరిగింది. ముందురోజు అక్కడ 202 మందికి కరోనా సోకగా..ప్రస్తుతం ఆ సంఖ్య 299కి చేరింది. కొవిడ్ పాజిటివిటీ రేటు 0.5 శాతం నుంచి 2.70 శాతానికి పెరిగింది. మరోపక్క దేశవ్యాప్తంగా క్రియాశీల కేసుల సంఖ్యలో కూడా స్వల్ప పెరుగుదల కనిపించింది.

గురువారం (ఏప్రిల్ 14,4.2022) కేంద్రం విడుదల చేసిన గణాంకాల ప్రకారం..4.34 లక్షల మందికి కొవిడ్‌ పరీక్షలు నిర్వహించగా.. 1,007 మందికి వైరస్‌ సోకినట్లు తేలింది. ముందురోజు కంటే ఏడు శాతం అధికంగా కేసులు వచ్చాయి. నిన్న దేశవ్యాప్తంగా ఒకే ఒక్క మరణం నమోదైంది. ఆ ఒక్కటి కూడా మహారాష్ట్రలో రికార్డయింది. 818 మంది కోలుకోగా.. రికవరీ రేటు 98.76 శాతంగా కొనసాగుతోంది. క్రియాశీల కేసుల సంఖ్య 11,058(0.03 శాతం)గా ఉంది. నిన్న 14.48 లక్షల మంది టీకా తీసుకోగా.. ఇప్పటివరకూ 186 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయి.