Donald Trump : కరోనాతో భారత్ సర్వనాశనం..చైనా డబ్బులు కట్టాల్సిందే

కరోనా వైరస్ కారణంగా భారత్‌ సర్వనాశనమైందని గురువారం ఫాక్స్ న్యూస్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.

Donald Trump : కరోనాతో భారత్ సర్వనాశనం..చైనా డబ్బులు కట్టాల్సిందే

India Has Just Been Devastated By Covid 19 Trump

Donald Trump కరోనా వైరస్ కారణంగా భారత్‌ సర్వనాశనమైందని గురువారం ఫాక్స్ న్యూస్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌కు చైనాయే కారణమని ట్రంప్‌ మరోసారి విరుచుకుపడ్డారు. వైరస్‌ వ్యాప్తికి బాద్యత వహిస్తుూ చైనా అమెరికాకు 10 ట్రిలియన్‌ డాలర్లు పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. వాస్తవానికి ప్రపంచానికి చైనా ఇంతకంటే ఎక్కువ చెల్లించాల్సి ఉంటుందని, కానీ దాని సామర్థ్యం ఇంతేనని అన్నారు. అయితే అమెరికాకు చెల్లించాల్సింది చాలా ఉందన్నారు.

చైనా చర్యల వల్ల అనేక దేశాలు నాశనమయ్యాయని ట్రంప్ ఆరోపించారు. ఇది ప్రమాదవశాత్తు లేదా అసమర్థత వల్ల జరిగిందని భావిస్తున్నానన్నారు. అయితే ఇది ప్రమాదవశాత్తు జరిగినా.. ఎలా జరిగినా చాలా దేశాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయని అన్నారు. వారు ఎప్పటికీ కోలుకోలేరని అన్నారు. అమెరికా కూడా చాలా తీవ్రంగా నష్టపోయిందని.. కానీ ఇతర దేశాలు చాలా తీవ్రంగా దెబ్బతిన్నాయని పేర్కొన్నారు.

భారత్‌ నే ఉదాహరణగా తీసుకుంటే ఆ దేశంలో ఎన్నడూలేని విధంగా ప్రజారోగ్య సంక్షోభం ఏర్పడిందని ట్రంప్ తెలిపారు. ఇప్పుడు భారత్‌లో ఏం జరుగుతుందో చూడండి.. భారతదేశం ఎంతగా శ్రమిస్తోందో చూడండి..భారతదేశం ఎంత బాగా పనిచేస్తుందో చూడండి అని భారతీయులు ప్రతిసారీ చెప్పేది ఏమిటంటే..భారతదేశం ఎంత బాగా పనిచేసిందో చూడండి అని..ఎందుకంటే వారు ఎప్పుడూ ఒక సాకు కోసం చూస్తున్నారు..భారతదేశం ఎంత బాగా చేస్తుందో చూడండి. భారతదేశం ఇప్పుడిప్పుడే వినాశనానికి గురైంది, వాస్తవంగా, ప్రతి దేశం సర్వనాశనం అయ్యింది అని ట్రంప్ అన్నారు.

కోవిడ్ వైరస్ ఎక్కడ నుంచి,ఎలా వచ్చింది అని తెలుసుకోవడం చాలా ముఖ్యం అని తాను భావిస్తున్నాన్నారు. ఈ విషయం తనకు తెలుసని తాను అనుకుంటున్నాని ట్రంప్ అన్నారు. అయితే చైనా తప్పకుండా ఇందుకు సాయం చేయాలన్నారు. అప్పుడే భారతీయ ఆర్థిక వ్యవస్థ, అమెరికా ఆర్థిక వ్యవస్థ వేగంగా తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటాయని ట్రంప్‌ అన్నారు. కరోనా వైరస్ తొలిసారిగా 2019 డిసెంబరులో చైనాలోని వుహాన్ నగరంలోనే వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. వుహాన్ ల్యాబ్ నుంచే వైరస్ లీకయ్యిందని ట్రంప్ ఆరోపణలు చేయడం ఇదేమీ మొదటిసారి కాదు.