‘భారత్లో యుద్ధం లేదు.. శాంతి లేదు’
భారత్లో యుద్ధం లేదు.. శాంతి లేదు అని ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. పాకిస్తాన్ టెర్రరిస్టుల కారణంగానే భారత్లో ఇటువంటి వాతావరణం ఏర్పడిందన్నారు. డెఫ్కమ్ ఘటన సందర్భంగా ఉగ్రవాదం గురించి ఆర్మీ చీఫ్ ప్రస్తావించారు.
‘మనం యుద్ధం లేదు. శాంతి లేదు అనే స్థితిలో ఉన్నాం. సెక్యూరిటీ బలగాలకు రహస్య వైఖరి ఉండాలి. ఆ విషయంలో రాజీపడితే చేయడానికి పనేమీ ఉండదు. ఈ ఉద్దేశ్యంతోనే దేశీయ వ్యవస్థను బలపరిచాం. ఇవాళ మనం రాజీపడిన వ్యవస్థలోనే ఉన్నాం’
‘టెక్నాలజీ రోజురోజుకూ పెరుగుతోంది. మనమింకా పాత పద్ధతుల్లోనే పనిచేస్తున్నాం. ఇంకా అభివృద్ధి చెందకపోతే వ్యవస్థ పూర్తిగా పాడైపోతుంది’ అని అన్నారు. ప్రస్తుతం భారత రక్షణా బలగాలు రాజీపడిన సెక్యూరిటీ వ్యవస్థతో నడుస్తున్నాయని, కమ్యూనికేషన్ వ్యవస్థలో అభివృద్ధి చెందాలని రహస్య వైఖరి నెలకొనాలని ఆయన అన్నారు.