India Corona: భారీగా పెరిగిన కొవిడ్ పాజిటివ్ కేసులు.. మహారాష్ట్రలో అత్యధికంగా నమోదు..

ఇండియాలో మళ్లీ డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. కొవిడ్ ముప్పు మరోసారి ఉప్పెనలా ముంచుకొస్తుందన్నభయాందోళన ప్రజల్లో వ్యక్తమవుతోంది. రోజురోజుకు కొత్తగా నమోదవుతున్నపాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి.

India Corona: భారీగా పెరిగిన కొవిడ్ పాజిటివ్ కేసులు.. మహారాష్ట్రలో అత్యధికంగా నమోదు..

Covid Cases

India Corona: ఇండియాలో మళ్లీ డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. కొవిడ్ ముప్పు మరోసారి ఉప్పెనలా ముంచుకొస్తుందన్నభయాందోళన ప్రజల్లో వ్యక్తమవుతోంది. రోజురోజుకు కొత్తగా నమోదవుతున్నపాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే పాజిటివ్ కేసులు అత్యధికంగా నమోదవుతున్న రాష్ట్రాలను కేంద్రం అలర్ట్ చేసింది. కొవిడ్ కేసులు పెరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేసింది. ఇదిలా ఉంటే నిన్న ఏడువేలకు పైగా కొత్త కొవిడ్ కేసులు నమోదు కాగా, అదే స్థాయిలో ఈరోజు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

COVID: కేసులు పెరుగుతున్న వేళ రాష్ట్రాల్లోని ప‌రిస్థితుల‌పై కేంద్రం ప‌ర్య‌వేక్ష‌ణ‌

కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం వెల్లడించిన గణాంకాల ప్రకారం.. గురువారం 3.5 లక్షల మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 7,584 మందికి వైరస్ పాజిటివ్ తేలింది. నిన్నటి సంఖ్యతో పోల్చితే ఈ రోజు కొత్తగా నమోదైన కేసుల సంఖ్య పెరిగింది. ఫలితంగా పాజిటీవిటీ రేటు 2.26 శాతంకు చేరింది. క్రియాశీలక కేసుల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. గురువారం కేంద్రం ఆరోగ్యశాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం 32,498 గా ఉన్న కేసులు.. తాజాగా 36,267(0.08శాతం)కు పెరిగాయి. 24గంటల వ్యవధిలో 24మంది కొవిడ్ తో చికిత్స పొందుతూ మృతిచెందారు. దీంతో భారత్ లో కొవిడ్ కారణంగా ఇప్పటి వరకు మృతుల సంఖ్య 5.24 లక్షలకు చేరింది.

Covid-19: మళ్లీ పెరుగుతున్న కోవిడ్ కేసులు

కొవిడ్ వ్యాప్తి నివారణకు దేశవ్యాప్తంగా టీకా పంపిణీ ప్రక్రియ వేగంగా కొనసాగుతుంది. గురువారం 15.31 లక్షల మందికి టీకా వేయగా, ఇప్పటి వరకూ 194కోట్లకుపైగా డోసులు పంపిణీ చేయడం జరిగిందని కేంద్రం తెలిపింది. ఇదిలాఉంటే దేశంలో పలు రాష్ట్రాల్లో కొవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య తక్కువగానే ఉన్నప్పటికీ మహారాష్ట్ర, కేరళలో అత్యధికంగా నమోదవుతున్నాయి. మహారాష్ట్రలో 2,813, కేరళలలో 2,193 మంది కొవిడ్ బారిన పడ్డారు. ఈ రెండు రాష్ట్రాల్లో కలిపి ఐదువేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. ఇక దేశ రాజధాని ఢిల్లీలో కొత్తగా 622 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.