Covid -19 : దేశంలో మళ్లీ పెరిగిన కోవిడ్ కేసులు
దేశంలో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. సోమవారం 30వేలకు దిగువున ఉన్న కేసులు తాజాగా మంగళవారం 42 వేలు దాటాయి. గడిచిన 24 గంటల్లో 42,625 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.
Covid -19 : దేశంలో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. సోమవారం 30వేలకు దిగువున ఉన్న కేసులు తాజాగా మంగళవారం 42 వేలు దాటాయి. గడిచిన 24 గంటల్లో 42,625 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. కొత్తగా నమోదైన కేసులతో కలిపి మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,17,69,132 కు పెరిగింది.
గత 24 గంటల్లో కోవిడ్ నుంచి 26,668 మంది బాధితులు కోలుకోగా.. మరో వైపు 562 మంది మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా కోవిడ్ బారిన పడి 4,25,757 మంది మరణించారు. ప్రస్తుతం దేశంలో 4,10,353 యాక్టివ్ కేసులున్నాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 97.37శాతంగా ఉందని, మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 1.29శాతం ఉందని, రోజువారీ పాజిటివిటీ రేటు 2.31శాతంగా ఉందని తెలిపింది. దేశంలో ఇప్పటి వరకు 47.31 కోట్ల కొవిడ్ పరీక్షలు నిర్వహించామని, టీకా డ్రైవ్లో భాగంగా మొత్తం 48,52,86,570 టీకా డోసులు పంపిణీ చేసినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.