Corona Cases : దేశంలో మళ్లీ విజృంభిస్తోన్న కరోనా… కొత్తగా 5,880 పాజిటివ్ కేసులు

దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 35వేల పైగా దాటింది. ప్రస్తుతం 35,199 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు కరోనా బారి నుంచి 4,41,96,318 మంది కోలుకున్నారు.

Corona Cases : దేశంలో మళ్లీ విజృంభిస్తోన్న కరోనా… కొత్తగా 5,880 పాజిటివ్ కేసులు

Corona Cases

Corona Cases : దేశంలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. కరోనా కేసులు మరోసారి పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా కొత్తగా 5వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. గత 24 గంటల వ్యవధిలో కొత్తగా 5,880 కేసులు నమోదు అయ్యాయి.

ఆదివారం ఉదయం 8గంటల నుంచి సోమవారం ఉదయం 8గంటల వరకు 85,076 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 35వేల పైగా దాటింది. ప్రస్తుతం 35,199 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు కరోనా బారి నుంచి 4,41,96,318 మంది కోలుకున్నారు.

Covid-19 Cases: దేశంలో కరోనా కేసులు పెరుగుతుండడంతో రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం కీలక సూచనలు

గత 24 గంటల్లో మొత్తం 14 మంది మరణించారు. కరోనా వైరస్ బారిన పడి ఇప్పటివరకు 5,30,979 మంది మృతి చెందారు. ఇక ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల్లో 0.08శాతం యాక్టివ్ గా ఉన్నాయి.

రికవరీ రేటు 98.73 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.19శాతంగా ఉంది. కాగా, ఇప్పటివరకు దేశంలో 220.66 కోట్ల (220,66,23,527) కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.