India Corona : దేశంలో కరోనా మరణ మృదంగం.. ఒక్కరోజే 3వేల 645 మంది మృతి
దేశంలో కరోనావైరస్ మహమ్మారి మరణ మృదంగం మోగిస్తోంది. పెద్ద సంఖ్యలో ప్రజల ప్రాణాలను కరోనా మహమ్మారి బలి తీసుకుంటోంది. నిన్న(ఏప్రిల్ 28,2021) ఒక్కరోజే ఏకంగా 3వేల 645మంది కోవిడ్ తో చనిపోవడం కరోనా విలయానికి అద్దం పడుతుంది. ఇక 3లక్షల
India Corona : దేశంలో కరోనావైరస్ మహమ్మారి మరణ మృదంగం మోగిస్తోంది. పెద్ద సంఖ్యలో ప్రజల ప్రాణాలను కరోనా మహమ్మారి బలి తీసుకుంటోంది. మరోసారి 3లక్షలకు పైగా కేసులు, 3వేలకు పైగా మరణాలు నమోదయ్యాయి. నిన్న(ఏప్రిల్ 28,2021) ఒక్కరోజే ఏకంగా 3వేల 645మంది కోవిడ్ తో చనిపోవడం కరోనా విలయానికి అద్దం పడుతుంది. ఇక 3లక్షల 79వేల 257 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా మొత్తం కేసుల సంఖ్య 1,83,76,524 కి చేరింది. కరోనాతో ఇప్పటివరకు చనిపోయిన వారి సంఖ్య 2,04,832 కి పెరిగింది.
దేశంలో ప్రస్తుతం 30,84,814 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 2లక్షల 69వేల 507మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో ఇదొక్కటే సానుకూలాంశం. ఇప్పటివరకు కోటీ 50లక్షల మంది వైరస్ ను జయించారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ గురువారం(ఏప్రిల్ 29,2021) కరోనా బులెటిన్ విడుదల చేసింది.
దేశంలో కరోనా వైరస్ ఉద్ధృతి కొనసాగుతోంది. నిత్యం లక్షల్లో కేసులు.. వేలల్లో మరణాలు సంభవిస్తుండటం ఆందోళనకు గురి చేస్తోంది. తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాలు కరోనా విపత్కర పరిస్థితులను కళ్లకు కడుతున్నాయి. ప్రజలు తప్పకుండా కరోనా నిబంధలు పాటించాలని, మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, వ్యాక్సిన్ తీసుకోవాలని కేంద్రం కోరుతోంది.
మొత్తం కరోనా కేసులు : 1,83,76,524
మొత్త కోలుకున్న వారు : 1,50,86,878
మొత్తం కరోనా మరణాలు : 2,04,832
యాక్టివ్ కేసులు : 30,84,814
వ్యాక్సినేషన్ తీసుకున్న వారి సంఖ్య : 15,00,20,648
తెలంగాణలో కరోనా విలయతాండవం:
తెలంగాణలో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. భారీగా కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. తాజాగా 80వేల 181 శాంపుల్స్ టెస్ట్ చేయగా 7వేల 994 మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. మరో 58మంది కరోనాకు బలయ్యారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ గురువారం(ఏప్రిల్ 29,2021) ఉదయం బులెటిన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 4వేల 9మంది కోలుకున్నారు. రాష్ట్రంలో 76వేల 60 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కొత్తగా నమోదైన కేసుల్లో ఒక్క జీహెచ్ఎంసీలోనే 1630 కేసులు ఉన్నాయి.
ఇంతవరకు రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 4 లక్షల 27 వేల 960కి పెరిగింది. రికవరీ రేటు మరింత తగ్గి 81.71 శాతంగా నమోదైంది. రాష్ట్రంలో ఇంతవరకు కోలుకున్నవారి సంఖ్య 3 లక్షల 49 వేల 692. కొత్తగా నమోదైన మరణాలతో కోవిడ్, తదితర సమస్యలతో మరణించిన వారి సంఖ్య రాష్ట్రంలో 2 వేల 208 కి పెరిగింది. మేడ్చల్ మల్కాజ్ గిరి లో 615, రంగారెడ్డి జిల్లాలో 558, నల్గొండ జిల్లాలో 424, సంగారెడ్డి జిల్లాలో 337, నిజామాబాద్ లో 301 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. పలు జిల్లాల్లో 200లకు పైగా కేసులు నమోదవడం ఆందోళనకు గురి చేస్తోంది.
కోవిడ్ టీకాలు:
తెలంగాణ రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. నిన్న(ఏప్రిల్ 28,2021) లక్షా 38 వేల 152 మందికి టీకాలు వేశారు. రాష్ట్ర వ్యాప్తంగా నిన్న 12 వందలకు పైగా వాక్సినేషన్ కేంద్రాలు పని చేసినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో ఇంతవరకు కోవిడ్ టీకాలు తీసుకున్నవారి సంఖ్య 45 లక్షల 36 వేలు.
ఏపీలో కరోనా ఉగ్రరూపం:
ఆంధ్రప్రదేశ్లో కరోనా వ్యాప్తి తీవ్రత కొనసాగుతోంది. రోజురోజుకీ పాజిటివ్ కేసుల సంఖ్య ప్రమాదకరంగా పెరుగుతోంది. మృతుల సంఖ్య కూడా ఆందోళన కలిగిస్తోంది. కొత్తగా రాష్ట్ర వ్యాప్తంగా 74వేల 681 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 14వేల 669 మందికి పాజిటివ్ వచ్చినట్లు తేలింది. మరో 71 మంది కరోనాకు బలయ్యారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బుధవారం(ఏప్రిల్ 28,2021) విడుదల చేసిన బులిటెన్ లో వెల్లడించింది. మొత్తం ఇప్పటివరకూ 1,62,17,831 కరోనా టెస్టులు చేయగా 10,69,544మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది.
India reports 3,79,257 new #COVID19 cases, 3645 deaths and 2,69,507 discharges in the last 24 hours, as per Union Health Ministry
Total cases: 1,83,76,524
Total recoveries: 1,50,86,878
Death toll: 2,04,832
Active cases: 30,84,814Total vaccination: 15,00,20,648 pic.twitter.com/ak1MKYUW7R
— ANI (@ANI) April 29, 2021