India Covid – 19 : దేశంలో కరోనా బెల్స్, ఆందోళన కలిగిస్తున్న మరణాలు

దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టినా... మరణాల సంఖ్య మళ్లీ పెరగడం ఆందోళన కలిగిస్తోంది. కేసుల సంఖ్య లక్షలోపే నమోదైనప్పటికీ... మరణాలు మాత్రం తొలిసారి 6 వేలు దాటాయి. 24 గంటల్లో ఏకంగా 6 వేల 148 మందిని వైరస్‌ పొట్టన బెట్టుకుంది. కొత్తగా 94 వేల 52 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

India Covid – 19 : దేశంలో కరోనా బెల్స్, ఆందోళన కలిగిస్తున్న మరణాలు

India Covid

India Covid-19 Deaths: దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టినా… మరణాల సంఖ్య మళ్లీ పెరగడం ఆందోళన కలిగిస్తోంది. కేసుల సంఖ్య లక్షలోపే నమోదైనప్పటికీ… మరణాలు మాత్రం తొలిసారి 6 వేలు దాటాయి. 24 గంటల్లో ఏకంగా 6 వేల 148 మందిని వైరస్‌ పొట్టన బెట్టుకుంది. కొత్తగా 94 వేల 52 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

ఒక్కరోజులో ఈ స్థాయిలో కరోనా మరణాలు నమోదు కావడం ఇదే తొలిసారి. రికార్డు స్థాయిలో ఒక్కరోజులోనే బీహార్‌లో 3 వేల 971 మంది మరణించారు. దేశంలో ఈ స్థాయిలో ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలో కూడా మరణాలు సంభవించలేదు. 72 శాతం కేవలం బిహార్‌లోనే నమోదయ్యాయి. ఆ తర్వాత మహారాష్ట్రలో 661 మంది కరోనాతో మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 11 లక్షల 67 వేల 952 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 3 లక్షల 59 వేల 676 మంది వైరస్‌ కారణంగా మృతి చెందారు. 23 కోట్ల 90 లక్షల 58 వేల మందికి వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేశారు.

Read More : Rajasthan : ఆవు పాలు త‌క్కువ ఇస్తోందని..ఒంటె గొంతు కోసి ఇంటిముందు పాతిపెట్టిన వ్యక్తి