భారత్లో కన్నా విదేశాలకే అధికంగా వ్యాక్సిన్ పంపిణీ..మోడీ భండారం బయటపెట్టిన 10 సెకన్ల వీడియో
దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో మహమ్మారికి అడ్డుకట్ట వేసే వ్యాక్సిన్ల కొరత కూడా దేశాన్ని వేధిస్తోంది.
India దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో మహమ్మారికి అడ్డుకట్ట వేసే వ్యాక్సిన్ల కొరత కూడా దేశాన్ని వేధిస్తోంది. మోడీ సర్కార్ అనుసరించిన వ్యాక్సిన్ విధానం కారణంగానే ప్రస్తుతం దేశంలో టీకాల కొరత ఏర్పడిందని జాతీయ స్థాయిలో పలువురు నేతలు మండిపడుతున్నారు. తాజాగా మాజీ బీజేపీ, ప్రస్తుత తృణమూల్ నేత యశ్వంత్ సిన్హా కేంద్ర విధానాలపై ఫైర్ అయ్యారు.
భారత ప్రభుత్వం.. తన ప్రజలకు ఇచ్చిన దానికన్నా అధిక వ్యాక్సిన్లను విదేశాలకు పంపిందని ఐక్యరాజ్య సమితిలో భారత రాయబారి చెప్పిన 10 సెకన్ల నిడివిగల వీడియోను యశ్వంత్ సిన్హా తన ట్వట్టర్ లో షేర్ చేశారు. ఆ వీడియోలో.. భారత్లో సరఫరా చేసిన టీకాల కన్నా అధికంగా 70 దేశాలకు భారత్ టీకాలను సరఫరా చేసినట్లు రాయబారి తెలిపారు.
ఈ పది సెకన్ల వీడియో మోడీ భండారాన్ని బయటపెట్టిందని యశ్వంత్ సిన్హా తన ట్వీట్ లో తెలిపారు. భారత్ తన ప్రజలకు ఇచ్చిన దానికన్నా అధిక వ్యాక్సిన్లను విదేశాలకు పంపిందని ఐక్యరాజ్య సమితిలో భారత రాయబారి చెప్పారు.. మోడీ ఇప్పుడు నిజంగానే ప్రపంచ నేత… భారతీయులు ఎలా పోతేనేం అని యశ్వంత్ సిన్హా తన ట్వీట్ లో ప్రధానిపై విమర్శలు గుప్పించారు. మరోవైపు, పరిమిత టీకాల కారణంగా ఢిల్లీలో నాలుగు రోజుల క్రితమే 18-44 ఏళ్ల వయస్సు వారికి టీకాలు ఆపేస్తున్నట్లు ప్రభుత్వం చెప్పిన విషయం తెలిసిందే.
A 10 sec video that EXPOSES MODI. India’s representative at the @UN informed the United Nations that India sent more vaccines abroad than has vaccinated its own people. Modi is now truly a world leader. Indians can go to hell. pic.twitter.com/tTF8q60HT5
— Yashwant Sinha (@YashwantSinha) May 16, 2021