ఇండియాలో కరోనా వ్యాక్సిన్ వచ్చేది అప్పుడే – మంత్రి హర్షవర్దన్

  • Published By: madhu ,Published On : August 23, 2020 / 09:51 AM IST
ఇండియాలో కరోనా వ్యాక్సిన్ వచ్చేది అప్పుడే – మంత్రి హర్షవర్దన్

కరోనా పీడ ఎప్పుడు విరుగుడు అవుతుందా ? దీనికి వ్యాక్సిన్ ఎప్పుడొస్తుందా ? అని ప్రపంచ వ్యాప్తంగా ఎదురు చూస్తున్నారు. భారతదేశ ప్రజలు కూడ కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. దేశంలో ఇప్పటికే వ్యాక్సిన్ తయారు చేసేందుకు సంస్థలు ప్రయత్నాలు మొదలు పెట్టిన సంగతి తెలిసిందే.

ట్రయల్స్ కూడా సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్నాయి. కానీ వ్యాక్సిన్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే దానిపై క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు. అయితే..దీనిపై కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ ఓ ప్రకటన చేశారు.

దేశంలో తయారు చేస్తున్న మొదటి కరోనా వ్యాక్సిన్ డిసెంబర్ నెలఖరు వరకు వస్తుందని తెలిపారు. దేశీయంగా తయారవుతున్న ఓ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ భాగంగా మూడో ఫేజ్ లో ఉందన్నారు. ఏడాది చివరి నాటికి అందుబాటులోకి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారాయన.

2020, ఆగస్టు 22వ తేదీ శనివారం ఘజియాబాద్ కు వచ్చారు. అక్కడ ఎన్డీఆర్ఎఫ్ ఆసుపత్రిని ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గత కొన్న నెలలుగా కరోనాపై దేశ ప్రజలు పోరాడుతున్నారని, ప్రభుత్వం కూడా పలు చర్యలు తీసుకొంటోందన్నారు.

దీని కారణంగా రికవరీ శాతం పెరుగుతోందని, ప్రస్తుతం ఇది 75 శాతంగా ఉందనే విషయాన్ని వెల్లడించారు. ఇప్పటి వరకు 2.2 మిలియన్ల మంది కరోనా నుంచి కోలుకుని ఇంటికి వెళ్లిపోయారని, మరో ఏడు లక్షల మంది త్వరలోనే కోలుకుంటారని ఆకాంక్షించారు.శనివారం 63 వేల 631 మంది కోలుకున్నారని మంత్రి హర్షవర్దన్ వెల్లడించారు.

భారత్‌కు చెందిన సుమారు 6 సంస్థలు వ్యాక్సిన్ అభివృద్ధి చేసే పనిలో ఉన్నాయి. మూడు వ్యాక్సిన్ రూపొందిస్తున్నాయి. AstraZeneca : Oxford University, Serum Institute of India (SII), Pune, సంయుక్తంగా (ChAdOx1) తయారు చేసున్నాయి. Bharat Biotech’s Covaxin, Indian Council of Medical Research సంయుక్తంగా, ZycovD by Zydus Cadila లు వ్యాక్సిన్ రూపొందించాయి.

ఫేజ్ 2 ట్రయల్స్ ప్రారంభించామని SII ఇటీవలే వెల్లడించిన సంగతి తెలిసిందే. ఫేజ్, ఫేజ్ 3 మనుషులపై ప్రయోగించడానికి పది ప్రాంతాలను ఎంపిక చేసింది. రెండో దశను Zydus Cadila ప్రారంభించింది.