Taliban : రష్యా రాజధానిలో తాలిబన్లతో చర్చలకు భారత్

తాలిబన్లతో చర్చలకు భారత్ రెడీ అయింది.

Taliban :  రష్యా రాజధానిలో తాలిబన్లతో చర్చలకు భారత్

Taliban (9)

Taliban   తాలిబన్లతో చర్చలకు భారత్ రెడీ అయింది. ఈ నెల 20న రష్యా అధ్యక్షతన మాస్కోలో..”మాస్కో ఫార్మేట్ టాక్స్ ఆన్ అప్ఘానిస్తాన్” పేరుతో జరిగే కార్యక్రమానికి చైనా, పాకిస్తాన్, ఇరాన్ లతో పాటు భారత్ కూడా హాజరుకానుందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గురువారం ప్రకటించింది. ఈ కార్యక్రామానికి తాలిబన్లు కూడా హాజరవుతున్న విషయం తెలిసిందే.

అప్ఘానిస్తాన్ ను తాలిబన్లు స్వాధీనం చేసుకున్న తర్వాత ఆగస్టు 31 న దోహాలో తాలిబాన్‌లతో భారతదేశపు అధికారికంగా సంప్రదింపులు జరుపగా..ఈ నెల 20న రష్యాలో భారత్-తాలిబన్ తాత్కాలిక ప్రభుత్వం మధ్య తొలిసారి అధికారికంగా చర్చలు జరుగనున్నాయి.

ALSO READ  ఎస్పీకి 400 సీట్లు పక్కా..ఫేక్ బాబా కథ త్వరలో ముగుస్తుంది