Indian Couple: 45 పిస్టోళ్లు తీసుకెళ్తూ పట్టుబడిన ఇండియన్ జంట

న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ వద్ద భారత జంట 45పిస్టోళ్లను తీసుకెళ్తుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తుపాకులు నిజమైనవా.. కాదా అనే ఇన్వెస్టిగేషన్ జరుపుతున్నారు. కౌంటర్ టెర్రరిజం యూనిట్ నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (NSG) నిజమైన తుపాకుల్లాగే కనిపిస్తున్న వాటిని పరీక్షించనుంది.

Indian Couple: 45 పిస్టోళ్లు తీసుకెళ్తూ పట్టుబడిన ఇండియన్ జంట

Guns

 

 

Indian Couple: న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ వద్ద భారత జంట 45పిస్టోళ్లను తీసుకెళ్తుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తుపాకులు నిజమైనవా.. కాదా అనే ఇన్వెస్టిగేషన్ జరుపుతున్నారు. కౌంటర్ టెర్రరిజం యూనిట్ నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (NSG) నిజమైన తుపాకుల్లాగే కనిపిస్తున్న వాటిని పరీక్షించనుంది.

ప్రాథమిక రిపోర్టులో నేషనల్ సెక్యూరిటీ గార్డ్ తుపాకులు బాగానే పనిచేస్తున్నాయని కస్టమ్స్ అఫీషియల్ పేర్కొన్నారు. ఈ కేసులో జగ్‌జీత్ సింగ్, జస్వీంర్ కౌర్ అనే దంపతులను అరెస్టు చేశారు అధికారులు.

జులై 10న వియత్నాంలోని హో చి మిన్హ్ సిటీ నుంచి బయల్దేరిన జంట బుధవారం న్యూ ఢిల్లీ చేరుకున్నారు. మన్ జీత్ సింగ్ అనే వ్యక్తి నుంచి తీసుకున్న రెండు ట్రాలీ బ్యాగులను జగ్ జీత్ సింగ్ పట్టుకని వస్తున్నాడు. ఆ మన్ జీత్ సింగ్ ఫ్రాన్స్ లోని పారిస్ నుంచి వియత్నాంకు వచ్చి వీరిని కలిశాడు. ఆ బ్యాగులను మోయలేక జారిపడటంతో విషయం తెలిసింది.

Read Also : టాప్ లష్కర్ కమాండర్ నదీమ్ అబ్రార్ అరెస్ట్

కస్టమ్స్ అధికారుల సమాచారం ప్రకారం.. మహిళా ప్రయాణికురాలు తన భర్త మోస్తున్న ట్రాలీ బ్యాగుల ట్యాగులను తీసేయడానికి ప్రయత్నించింది. వారి నుంచి రూ.22.5లక్షల విలువ చేసే 45తుపాకులను స్వాధీనపరచుకున్నట్లు స్టేట్మెంట్ లో పేర్కొన్నారు. గతంలో ఈ దంపతులు టర్కీ నుంచి 25 పిస్టోళ్లు తెప్పించినట్లు తెలుస్తుంది.