నాలుగు దశాబ్దాల తర్వాత సరిహద్దులో కాల్పులు.. చొరబాటుకు యత్నించిన చైనా.. భారత్ వార్నింగ్ షాట్స్

  • Published By: vamsi ,Published On : September 8, 2020 / 06:51 AM IST
నాలుగు దశాబ్దాల తర్వాత సరిహద్దులో కాల్పులు.. చొరబాటుకు యత్నించిన చైనా.. భారత్ వార్నింగ్ షాట్స్

తూర్పు లడఖ్‌లోని లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్(ఎల్‌ఐసి) పై భారత్, చైనా మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకు పెరుగి పోతూ ఉన్నాయి. చైనా దళాలు మళ్లీ చొరబడటానికి ప్రయత్నించగా.. దాదాపు నాలుగు దశాబ్దాల తరువాత, సోమవారం రెండు దేశాల మధ్య కాల్పులు జరిగాయి. అయితే, ఒకరినొకరు హెచ్చరించడానికి మాత్రమే కాల్పులు జరుపుకున్నట్లుగా తెలుస్తుంది. సంఘటన తర్వాత పరిస్థితి అదుపులో ఉన్నట్లుగా చెబుతున్నారు. ఈ సంఘటన గురించి భారతదేశం నుండి అధికారిక ప్రకటన రాలేదు.



అయితే చైనా ప్రభుత్వ మౌత్ పీస్ అయిన గ్లోబల్ టైమ్స్ మాత్రం సైన్యాన్ని ఉటంకిస్తూ భారత్‌ను నిందించింది. భారత సైనికులు చొరబడటానికి ప్రయత్నించారని, ఈ సంఘటన ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతకు కారణం అవుతుందని భావిస్తున్నట్లు చెప్పారు.

మరోవైపు పంగోంగ్ సరస్సు దక్షిణ ఒడ్డున చైనా దళాలు చొరబడటానికి ప్రయత్నాలు చేసినట్లుగా భారత ఆర్మీ వర్గాలు తెలిపాయి. ఈ సమయంలో భారత సైనికులు హెచ్చరికలు జారీ చేశారు. కాని ఆపడానికి బదులుగా వారు కాల్పులు జరిపారు. దీనిపై భారత సైనికులు కూడా తిరిగి కాల్పులు జరిపారు.



హెచ్చరిక కోసం బుల్లెట్ వెళ్లినప్పటికీ, సరిహద్దు వద్ద ఎంతో ఉద్రిక్తత పెరిగింది. ఇంతలో, గ్లోబల్ టైమ్స్ ఒక చైనా సైనిక ప్రతినిధిని ఉటంకిస్తూ భారత సైనికులు ఎల్‌ఐసిని దాటి పాంగోంగ్ సరస్సుకి దక్షిణం వైపున ఉన్న షెన్‌పావో కొండ ప్రాంతంలోకి ప్రవేశిస్తున్నారని పేర్కొంది. చైనా సైనికులు వారిని ఆపగా, భారత సైనికులు కాల్పులు జరిపినట్లు గ్లోబల్ టైమ్స్ పేర్కొంది. దీని తరువాత, చైనా సైనికులు కూడా కాల్పులు జరిపారు.
https://10tv.in/another-chinese-intrusion-another-list-of-banned-apps/
చైనా సైనిక ప్రతినిధి విడుదల చేసిన ఒక ప్రకటనలో, భారత సైన్యం చట్టవిరుద్ధంగా ఎల్‌ఐసిని దాటి పాంగోంగ్ సరస్సు యొక్క దక్షిణ భాగంలో మరియు షెన్‌పావ్ హిల్ ప్రాంతంలోకి ప్రవేశించిందని ఆరోపించారు. “ఇలాంటి ప్రమాదకరమైన చర్యను వెంటనే ఆపాలని మేము భారతదేశాన్ని కోరుతున్నాము” అని చైనా ప్రతినిధి అన్నారు.



సరిహద్దులో ఉద్రిక్తతను తగ్గించడానికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, చైనా రక్షణ మంత్రి వీ ఫెంగ్ చర్చలు జరిపారు. సెప్టెంబర్ 10 న విదేశాంగ మంత్రి ఎస్.కె. జైశంకర్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి మాస్కోలో చర్చలు జరపనున్నారు. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్సీఓ) సమావేశంలో పాల్గొనడానికి జైశంకర్ రష్యా రాజధాని మాస్కో వెళ్తున్నారు.