థాయ్‌లాండ్‌లో చనిపోయిన ఇండియన్ టెకీ ప్రగ్యా

  • Published By: vamsi ,Published On : October 11, 2019 / 03:02 AM IST
థాయ్‌లాండ్‌లో చనిపోయిన ఇండియన్ టెకీ ప్రగ్యా

మధ్యప్రదేశ్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ప్రగ్యా పలివాల్(29) థాయ్‌లాండ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయింది. ప్రస్తుతం ఆమె మృతదేహం థాయిలాండ్ లోని ఓ ఆసుపత్రిలో ఉంది. మధ్యప్రదేశ్ కి చెందిన ప్రగ్యా.. బెంగళూరులోని హాంగ్ కాంగ్ బేస్డ్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. కంపెనీ వార్షిక సమావేశం కోసం ఆమె థాయిలాండ్ వెళ్లగా.. అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె చనిపోయారు. బెంగళూరుకు చెందిన తన రూమ్ మేట్ కు ఈ విషయం ముందుగా తెలిసింది.

ఆమె వెంటనే ఈ సమాచారాన్ని కుటుంబసభ్యులకు తెలియజేయగా.. కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. వెంటనే తమ కుమార్తె మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావడానికి సహాయం చేయాలంటూ స్థానిక ఎమ్మెల్యే అలోక్ చతుర్వేదిని కోరారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కమల్ నాథ్, కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లారు. వెంటనే అధికారులు థాయిలాండ్ లోని భారత రాయబార కార్యాలయానికి సమాచారం అందించారు.

ఆమె మృతదేహాన్ని త్వరలోనే స్వస్థలానికి పంపిస్తామని చెప్పారు. అందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. బాధిత కుటుంబానికి తమ వంతు సహాయం చేస్తామని ముఖ్యమంత్రి కమల్ నాథ్ ప్రకటించారు. మృతురాలి కుటుంబసభ్యులు ఎవరైనా వస్తే వారికి అప్పగిస్తామని థాయ్ లాండ్ అధికారులు కూడా చెబుతున్నారు