Hidden Charges: హిడెన్ ఛార్జీల పేరుతో రూ.9వేల 700కోట్ల బ్యాంకు దోపిడీ
హిడెన్ ఛార్జీల పేరుతో బ్యాంకు లూటీలు పెరుగుతూనే ఉన్నాయి. ఉన్నత విద్య.. మెరుగైన వైద్యం కోసం విదేశాలకు వెళ్లే భారతీయుల సంఖ్య పెరుగుతుండటంతో వీరి దోపిడీకి మరింత పెరిగిపోతోంది.
Hidden Charges: హిడెన్ ఛార్జీల పేరుతో బ్యాంకు లూటీలు పెరుగుతూనే ఉన్నాయి. ఉన్నత విద్య.. మెరుగైన వైద్యం కోసం విదేశాలకు వెళ్లే భారతీయుల సంఖ్య పెరుగుతుండటంతో వీరి దోపిడీకి మరింత పెరిగిపోతోంది. విదేశాల్లో ఉన్నవారికి డబ్బులు పంపే కుటుంబ సభ్యుల నుంచి ప్రోసెసింగ్ ఫీజు, ఎక్సేంజ్ మార్క్అప్ పేరుతో బ్యాంకులు వేల కోట్ల రూపాయలను దోపిడీ చేస్తున్నాయి.
ఈ మొత్తం మోసాన్ని ఇండిపెండెంట్ రీసెర్చ్ సంస్థ క్యాపిటల్ ఎకనామిక్స్ బయట పెట్టింది.
విదేశాల్లో వారి కోసం భారతీయులు పంపిస్తున్న నగదు 2021 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 12.7 బిలియన్ డాలర్లు (సుమారు 95 వేల కోట్లు)గా ఉంది. ఈ మొత్తంలో అత్యధికంగా ఉన్నత విద్య కోసం 3.8 బిలియన్ డాలర్లు వెచ్చిస్తుండగా, ట్రావెల్ కోసం 3.2 బిలియన్ డాలర్లు, ఫ్యామిలీ సపోర్ట్ 2.7 బిలియన్ డాలర్లు ఉన్నాయి.
…………………………………………. : జమ్మూకశ్మీర్ లో ఎన్కౌంటర్.. ఉగ్రవాది హతం
తగ్గిస్తున్నామంటూనే
కొన్నేళ్ల కిందటే విదేశాలకు డబ్బు పంపే విషయంలో ఛార్జీలు తగ్గిస్తున్నామని.. బ్యాంకులు ప్రకటించాయి. అలా వాటి ఆదాయం గణనీయంగా పడిపోయింది. 2016లో ప్రాసెసింగ్ ఫీజు కింద రూ.15వేల 17 కోట్లు వసూలు కాగా, 2019లో ఈ మొత్తం 12వేల 142 కోట్లకు పడిపోయింది. ఈ నష్టాన్ని పూడ్చుకునేందుకు ఎక్సేంజీ మార్క్అప్ పేరుతో వసూలు చేసే హిడెన్ ఛార్జీలను ఒక్కసారిగా పెంచేశాయి బ్యాంకులు.
2016లో ఈ ఛార్జీల మొత్తం రూ.2వేల 505 కోట్లు ఉండగా 2019కి వచ్చేసరికి రూ.4వేల 422 కోట్లకు పెరిగింది. 2020 ఏడాదికి సంబంధించి విదేశీలకు నగదు చెల్లించే సమయంలో ఎక్సేంజీ మార్క్అప్ పేరుతో రూ.9వేల 700 కోట్ల రూపాయలు అనధికారికంగా వసూలు చేసినట్టు క్యాపిటల్ ఎకనామిక్స్ సంస్థ తెలిపింది. ఈ ఏడాది విదేశీ చెల్లింపులకు సంబంధించి ప్రాసెసింగ్ ఫీజుగా బ్యాంకులు రూ.26వేల 300 కోట్లు వసూలు చేశాయి. హిడ్డెన్ ఛార్జెస్ పేరుతో వసూలు చేసిన 36 శాతం వాటా రూ.9వేల 700 గా ఉంది.
………………………………………: కొడుకు కోసం డైరెక్టర్స్ అందర్నీ దింపిన పూరి జగన్నాధ్
ఎక్సేంజీ మార్క్అప్
విదేశాలకు డబ్బు పంపివ్వడం లేదా అక్కడి నుంచి నగదు స్వీకరించే సమయంలో బ్యాంకులు ఎక్సేంజీ మార్క్అప్ పేరుతో ఛార్జీలు వసూలు చేస్తుంటాయి. ఫారెక్స్ మార్కెట్లో డాలరు – రూపాయిల మధ్య మారకం విలువ స్థిరంగా ఉండదు. ఎక్సేంజీ మార్కప్ ఛార్జీలను నేరుగా కాకుండా హిడ్డెన్ ఛార్జీల్లో వసూలు చేస్తున్నాయి.
2016లో ప్రాసెసింగ్ ఫీజు మొత్తం రూ.10వేల 200 కోట్లు ఉండగా 2020కి వచ్చే సరికి అది కాస్తా రూ.14వేల కోట్లకు చేరుకుంది. ఇదే కాలానికి సంబంధించి రెమిటెన్స్ కోటాలో వసూలు చేసిన హిడెన్ ఛార్జీల విలువ రూ. 4వేల 200 కోట్ల నుంచి రూ.7వేల 900 కోట్లకు చేరుకుంది.