ఇండిగో ‘రన్వే సేల్’ ఆఫర్ : రూ.899లకే విమాన టికెట్
ఢిల్లీ : ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో తాజాగా ప్రయాణికులకు అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. ‘రన్వే సేల్’లో భాగంగా రూ.899 మినిమిమ్ కాస్ట్ తో విమాన టికెట్ ఆఫర్ చేస్తోంది. ఇక్కడ గమనించాల్సిందేంటంటే ఇది స్వదేశీ ప్రయాణానికి మాత్రమే వర్తిస్తుందని తెలిపింది ఇండిగో సంస్థ.
Also Read : గురి చూసి కొట్టారు : పాక్ డ్రోన్ను కూల్చేసిన భారత్
ఈ రన్వే సేల్ మార్చి 7 వరకు అందుబాటులోకి రానుంది. దీంట్లో భాగంగా టికెట్స్ బుకింగ్ చేసుకున్నవారు మార్చి 19 నుంచి సెప్టెంబర్ 28 వరకు మధ్య కాలంలో ఎప్పుడైనా ప్రయాణించొచ్చు. డిస్కౌంట్ ఆఫర్ సీట్ల లభ్యతపై ఆధారపడి ఉంటుందని కంపెనీ తెలిపింది.
రూట్స్..టిక్కెట్స్ ఆఫర్స్ ఇలా ఉన్నాయ్
- ఢిల్లీ – బెంగళూరు టికెట్ రూ.2,799
- ఢిల్లీ – భువనేశ్వర్ రూ.3,199
- ఢిల్లీ -కోల్కతా రూ.2,899
- ఢిల్లీ – చెన్నై రూ.2,799
- ఢిల్లీ -ముంబై రూ.2,399
- ఢిల్లీ – దుబాయ్ విమాన టికెట్ ధర రూ.6,499
- ఢిల్లీ – ఫుకెట్ ధర రూ.8,199
- కొచ్చి – దుబాయ్ రూ.5,799గా ఉంది.
ఈ డిస్కౌంట్ ఆఫర్ అనేది ఎయిర్పోర్ట్ చార్జీలకు..ప్రభుత్వ పన్నులకు వర్తించదని ఇండిగో విమానయాన సంస్థ స్పష్టంచేసింది. అలాగే ఈ ఆఫర్ కేవలం నాన్ స్టాప్ ఫ్లైట్స్కు మాత్రమే వర్తిస్తుందని తెలిపింది. ఈ ఆఫర్ ఇతర స్కీమ్స్కు, ప్రమోషన్ ఆఫర్లకు వర్తించదు.
ఇండస్ఇండ్ బ్యాంక్ కస్టమర్లు ఆఫర్లో భాగంగా టికెట్లను బుకింగ్ చేసుకుంటే 20 శాతం వరకు అంటే రూ.2,000 వరకు క్యాష్బ్యాక్ పొందొచ్చు. అలాగే మొబిక్విక్ యూజర్ల కూడా 15 శాతం వరకు అంటే రూ.800 వరకు సూపర్క్యాష్ సొంతం చేసుకోవచ్చు.
Also Read : ఇది కొంచెం ఢిఫరెంట్… బీర్ బాత్ టబ్ ఛాలెంజ్ చూశారా?