Bihar: లంచం విషయంలో వాగ్వాదం! నడిరోడ్డుపై చితకబాదుకున్న ఇద్దరు పోలీసులు

ఇద్దరు పోలీసుల మధ్య గొడవ జరగడంతో వారిని విడదీయడం కష్టంగా మారింది. ఈ ఘటన తర్వాత పోలీసుల సేవ సామాన్యుల్లో నవ్వులాటగా మారింది. వీడియోలో ప్రజలు పోలీసులను దుర్భాషలాడుతున్నారు. ‘‘వీళ్లలో వీళ్లే కొట్టుకుంటున్నారు, ఇక ప్రజల మీద జరిగే దాడులకు వీళ్లేం స్పందిస్తారంటూ’’ అక్కడ ఉన్నవాళ్లే కామెంట్ చేస్తున్నారు

Bihar: లంచం విషయంలో వాగ్వాదం! నడిరోడ్డుపై చితకబాదుకున్న ఇద్దరు పోలీసులు

Viral Video: బీహార్‌లోని నలంద జిల్లాలో ఎమర్జెన్సీ సర్వీస్‌కు చెందిన ఇద్దరు పోలీసుల మధ్య దాదాపు అరగంట పాటు తీవ్ర వాగ్వాదం జరిగింది. రహుయి పోలీస్ స్టేషన్ పరిధిలోని సోహ్సరాయ్ హాల్ట్ సమీపంలో సోమవారం ఉదయం ఈ ఘటన జరిగింది. వివాదం కారణంగా తీవ్ర స్థాయిలో బూతులు తిట్టుకుంటూ ఒకరినొకరు చితకబాదుకుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇద్దరు పోలీసులు ఒకరినొకరు దుర్భాషలాడుకోవడం, దాడి చేసుకోవడం వీడియోలో చూడొచ్చు.

ఇద్దరు పోలీసుల మధ్య గొడవ జరగడంతో వారిని విడదీయడం కష్టంగా మారింది. ఈ ఘటన తర్వాత పోలీసుల సేవ సామాన్యుల్లో నవ్వులాటగా మారింది. వీడియోలో ప్రజలు పోలీసులను దుర్భాషలాడుతున్నారు. ‘‘వీళ్లలో వీళ్లే కొట్టుకుంటున్నారు, ఇక ప్రజల మీద జరిగే దాడులకు వీళ్లేం స్పందిస్తారంటూ’’ అక్కడ ఉన్నవాళ్లే కామెంట్ చేస్తున్నారు. ఈ విషయానికి సంబంధించి, రాహుయ్ పోలీస్ స్టేషన్ ఇంచార్జి నందన్ కుమార్ సింగ్ మాట్లాడుతూ, వైరల్ అయిన వీడియోలో ఉన్న పోలీసులు ఇద్దరూ రాహుయ్ పోలీస్ స్టేషన్‌కు చెందినవారు కాదని అన్నారు. వీరిలో 112 మంది ఎమర్జెన్సీ సర్వీస్ పోలీసులు ఉన్నారని తెలిపారు.

Jharkhand: జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‭కు సుప్రీంలో ఎదురుదెబ్బ.. ఈడీ పిటిషన్ పై నో రిలీఫ్

ఈ ఘటన తన పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందని నందన్ కుమార్ సింగ్ తెలిపారు. వైరల్ అవుతున్న వీడియో ద్వారా అతనికి ఈ సమాచారం వచ్చింది. అనేదానిపై పూర్తి సమాచారం సేకరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ఇలాంటి ఘటన ఎందుకు జరిగిందో ఆరా తీస్తున్నారు. కాగా, ఇద్దరు పోలీసులను సస్పెండ్ చేసినట్లు ఎస్పీ అశోక్ మిశ్రా తెలిపారు. గొడవకు కారణం స్పష్టంగా తెలియరాలేదని అధికార వర్గాలు చెప్తున్నప్పటికీ.. లంచం విషయంలోనే వివాదం ఏర్పడినట్లు స్థానికులు అంటున్నారు.