నేపాలీల కోసం…అంతర్జాతీయ నిషేధ ‘బ్రిడ్జి’ పునఃప్రారంభం
Dharchula Bridge:అంతర్జాతీయ నిషేధం ఎదుర్కొంటున్న ఉత్తరాఖండ్లోని ప్రముఖ థార్చులా బ్రిడ్జ్ తాత్కాలికంగా పునఃప్రారంభమైంది. గతంలో భారత ఆర్మీ,ఇతర విభాగాలలో పనిచేసి రిటైర్ట్ అయిన నేపాలీ సిటిజన్లు తమ పెన్షన్ సొమ్మును విత్ డ్రా చేసుకునేందుకు…నేపాల్ అభ్యర్థన మేరకు థార్చులాలోని బ్రిడ్జిని మూడు రోజుల పాటు రీఓపెన్ చేస్తున్నట్లు ఉత్తరాఖండ్ ప్రభుత్వం తెలిపింది.
బుధవారం నుంచి శుక్రవారం(అక్టోబర్-23) వరకు నిర్ణీత కాలవ్యవధిలోనే..రోజూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు బ్రిడ్జ్ ద్వారా రాకపోకలకు అనుమతి కల్పించారు అధికారులు.
https://10tv.in/prabhas-to-vijay-5-south-indian-celebs-who-made-more-money-than-bollywood-stars/
2 గంటల తర్వాత బ్రిడ్జ్ను మూసివేయబడుతుందని థార్చులా తహసీల్దార్ మోహన్ గోస్వామి తెలిపారు. బుధవారం 239 మంది నేపాలీయులు ఈ బ్రిడ్జ్ గుండా మన దేశంలోకి వచ్చారు. అలాగే 151 మంది భారతీయులు నేపాల్ వెళ్లారు.
కాగా, నేపాల్ అభ్యర్థన మేరకు.. పింఛన్ దార్ల సౌకర్యార్థం ప్రతి నెలా ఈ సదుపాయం కల్పిస్తామని థార్చులా డిప్యూటీ కలెక్టర్ అనిల్ కుమార్ శుక్లా తెలిపారు.