IAS Chandini Chandran‌ : ఐఏఎస్ అధికారిణి అందమైన ప్రేమ కథ..మధుర జ్ఞాపకాల చిత్రం

2015లో ఓ లక్ష్యంతో రాసిన పరీక్షలు..2016లో ఓ కెమెరా కన్ను అనుకోకుండా క్లిక్ మనిపించిన ఓ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైలర్ అయ్యింది. ఏంటీ ఆ రెండేళ్లలో జరిగింది? ఆ ఫోటో ఎవరిది? అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ఆ ఫోటోలో ఉన్నది మరెవరో కాదు. ‘చాందినీ చంద్రన్’. ఆమె ఇప్పుడు ఐఏఎస్ అధికారిణి.

IAS Chandini Chandran‌ : ఐఏఎస్ అధికారిణి అందమైన ప్రేమ కథ..మధుర జ్ఞాపకాల చిత్రం

Chandini Chandran Viral Pic

IAS Chandini Chandran‌ Viral Pic : 2015లో ఓ లక్ష్యంతో రాసిన పరీక్షలు..2016లో ఓ కెమెరా కన్ను అనుకోకుండా క్లిక్ మనిపించిన ఓ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైలర్ అయ్యింది. ఏంటీ ఆ రెండేళ్లలో జరిగింది? ఆ ఫోటో ఎవరిది? అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ఆ ఫోటోలో ఉన్నది మరెవరో కాదు. ‘చాందినీ చంద్రన్’. ఆమె ఇప్పుడు ఐఏఎస్ అధికారిణి. ఈ ఫోటో తీసేనాటికి ఆమెకు వివాహం కాలేదు. కానీ ఈ ఫోటోలో ఆమెతో పాటు ఉన్నది ఆమె భర్తే. కానీ అప్పుడు ఇష్టసఖుడు..ఇప్పుడు ఆమె జీవన సహచరుడు. ఐఏఎస్ అధికారి కావాలనే కలతో 2015లో చాందినీ చంద్రన్ సివిల్స్ పరీక్షలు రాశారు. ఎంతో ఇష్టపడి..కష్టపడి పరీక్షలు రాశాక. ఆమె రిలాక్స్ అవ్వాలనుకున్నారు. అలా తన ఇష్టసఖుడితో కలిసి బయటకు వెళ్లారు. అదే సమయంలో వర్షం పూల జల్లులా పడింది. అంతే ఇద్దరూ గొడుకు కింద చేరారు. అదే సమయంలో ఓ కెమెరా క్లిక్ మంది. అదే ఈనాడు సోషల్ మీడియాలో వైరల్ అయిన ఐఏఎస్‌ అధికారిణి చాందినీ చంద్రణ్‌ ఆమె భర్త కలిసి ఉన్న ఫోటో.. ఈ ఫోటో వెనుక ఉన్న ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీ గురించి తప్పకుండా తెలుసుకోవాల్సిందే..

తన ప్రియ మిత్రుడు..జీవితం పంచుకోవాలనుకునే ఇష్టసఖుడు అయిన అరుణ్‌ సుదర్శన్‌తో కలిసి చాందినీ చంద్రణ్ సరాదాగా ఔటింగ్‌కి వెళ్లారు. సరిగ్గా అప్పుడే వర్షం పడింది. ఒకే గొడుగు కింద ఇద్దరూ రోడ్డు మీద నడుస్తూ వెళ్తున్నారు. అరుణ్‌ సుదర్శన్‌ ఆమె భుజంపై ఆత్మీయంగా చేయి వేసి ముందుకు నడిపిస్తుండగా.. ఆమె చిరునవ్వులు చిందిస్తున్నారు. అప్పుడే ఓ ఫొటో జర్నలిస్టు కెమెరాను క్లిక్‌ మనిపించారు. ఇంకేముంది.. తర్వాతి రోజు పత్రికలో.. ‘‘వేసవివి సెలవు.. రాష్ట్రంలో అక్కడక్కడా జల్లులు పడే అవకాశం ఉంది’’ అంటూ చాందినీ చంద్రణ్‌, అరుణ్‌ సుదర్శన్‌ నడుచుకుంటూ వెళ్తున్న ఫొటోను ఇందుకు జతచేసి పబ్లిష్‌ చేసి ఓ ఇంగ్లీషు పత్రికలో వేశారు. మీడియాకు ఏదైనా దొరికితే అంతేగా మరి..అలా సివిల్స్ రాసి పరీక్షా ఫలితాలు రాకుండానే వారి ఫోటో పేపర్ లో పడింది.

కాకతాళీయంగా అదే రోజు సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షా ఫలితాలు వచ్చాయి. కానీ చాందినీ చంద్రణ్‌ ఎంపిక కాలేదు. (ఆమె అప్పుడు పాస్ కాలేదు)కానీ వారిద్దరి ఫొటో పబ్లిష్‌ కావడం గమనార్హం. దీంతో.. అరుణ్‌ సుదర్శన్‌… సదరు పత్రికా సంస్థకు ఫోన్‌ చేసి, తమ ఫొటో ఎందుకు వేశారని నిలదీశారు. సదరు ఫొటోగ్రాఫర్‌తో మాట్లాడి ఇలాంటి ఫొటోలు అనుమతి లేకుండా పబ్లిష్‌ చేయటమేంటీ అని నిలదీశారు. ఇటువంటివి ప్రచురించేటప్పుడు వారిజీవితాలు ఏమవుతాయనే విషయం ఆలోచించరా? అని ప్రశ్నించారు. ఈ విషయాన్ని ట్విటర్‌ వేదికగా పంచుకున్న ఐఏఎస్‌ చాందినీ చంద్రణ్‌ గత జ్ఞాపకాలకు గుర్తు చేసుకున్నారు.

ఈ ఫోటోలో తప్పేమీ లేదు. కానీ కొన్నిసార్లు. కొన్ని సందర్భాలు ఇబ్బంది కలిగిస్తాయి. ఎందుకంటే.. అప్పటికి మాకింకా పెళ్లి కాలేదు. కానీ ఈ తరువాత మేం వివాహం చేసుకున్నాం. ఇటీవలే ఈ ఫొటో గురించి గుర్తుకు రాగా.. అరుణ్‌ సుదర్శన్‌ సదరు ఫొటోగ్రాఫర్‌ను సంప్రదించగా… ఆ ఫొటోకాపీని మాకు పంపించారు. ఇందుకు కేవలం థాంక్స్‌ అనే మాటతో సరిపెట్టలేను‘ అంటూ అలనాటి తమ ప్రేమకథను..అనుకోకుండా జరిగిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారామె. ఆ ఫోటో వెనుక ఉన్న తమ ప్రేమకథను తెలిపారు.

ఆ తరువాత 2017లో నేను సివిల్స్ పరీక్షల్లో నా లక్ష్యం సాధించారు. పరీక్షల్లో పాస్ అయ్యాను. ఐఏఎస్ అయ్యాను అని తెలిపారు. ఇప్పుడు నేను త్రిపురలోని కాంచన్ పూర్ లో సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ గా డ్యూటీ చేస్తున్నానని చాందిని తెలిపారు. అరుణ్ నేను వివాహం చేసుకున్నా. ఈ క్రమంలో మా ఫోటోలు చూసుకుంటుంటే అలనాటి మా ఫోటో కథ గుర్తుకొచ్చింది. వెంటనే అరుణ్ ఆ ఫోటో గ్రాఫర్ కు ఫోన్ చేసి తమ ఫోటో తెప్పించారు. ఈ ఫోటో చూసాక నాకు అలనాటి మా ప్రేమ కథ గుర్తుకొచ్చింది. అది నెట్టింట్లో పంచుకోవాలనిపించి ఇలా షేర్ చేశానని తెలిపారు ఐఏఎస్ చాందిని చంద్రణ్.

‘‘తమ ఫోటోల్లో అత్తుత్తమ ఫొటోల్లో ఇది ఒకటి..మధుర జ్ఞాపకాలు. ఏంటో.. ఊహించనవి అలా అప్పుడప్పుడూ అలా జరిగిపోతూ ఉంటాయి. పాత ఫొటో అయినా ఇది మీకెంతో ప్రత్యేకం కదా’’ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా ఐఐటీ మద్రాస్‌లో విద్యనభ్యసించిన చాందినీ చంద్రణ్‌ 2017లో ఐఏఎస్‌కు ఎంపికయి తన లక్ష్యాన్ని సాధించారు.అలాగే కోరుకున్న ప్రియుడిని జీవితభాగస్వామి చేసుకున్నారు.