భ‌ద్రాచ‌లాన్ని కాపాడుకుంటాం : పొంగులేటి

  • Published By: veegamteam ,Published On : May 10, 2019 / 10:07 AM IST
భ‌ద్రాచ‌లాన్ని కాపాడుకుంటాం : పొంగులేటి

పోలవరం ప్రాజెక్టుపై ఎన్టీటీలో విచారణ జరిగింది. ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం పెంపుతో ముంపు ప్రాంతాలు పెరుగుతాయని ఆందోళన వ్యక్తం చేస్తూ మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి రాసిన లేఖను పిటిషన్ గా పరిగణించిన ఎన్జీటీ విచారణ చేపట్టింది. భద్రాచలంతోపాటు వందలాది గిరిజన గ్రామాలపై ముంపు ప్రభావం పడకుండా చూడాలని పొంగులేటి కోరారు. 

ప్రాజెక్టు కోసం ఇప్పటికే ఏడు మండలాలు తీసుకున్నారని.. 270 గ్రామాలు మునిగిపోయే పరిస్థితి వచ్చిందన్నారు. పోలవరం ప్రాజెక్టుకు తాము వ్యతిరేకం కాదని చిత్తశుద్ధితో చెబుతున్నామన్నారు పొంగులేటి. భద్రాచలాన్ని పరిరక్షించుకుంటామని చెప్పారు. న్యాయ పోరాటం చేస్తామన్నారు. దీనిపై తదుపరి విచారణను ఆగస్టు 27, 2019కు వాయిదా వేసింది.