IRCTC : రైల్లో గట్టిగా మాట్లాడినా .. స్పీకర్‌ పెట్టి మ్యూజిక్ విన్నా జరిమానా..

IRCTC రాత్రిపూట ప్రయాణించే ప్రయాణికుల కోసం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. తోటి ప్రయాణీకులకు ఇబ్బంది కలుగుతుందని కూడా చూడకుండా ఇష్టానుసారంగా వ్యవహరించేవారికి ఈ మార్గదర్శలు తప్పనిసరిగా వర్తిస్తాయి. ఇవి పాటించకపోతే జరిమానా తప్పదంటూ సూచనలు చేసింది.

IRCTC :  రైల్లో గట్టిగా మాట్లాడినా .. స్పీకర్‌ పెట్టి మ్యూజిక్ విన్నా జరిమానా..

IRCTC announces new guidelines

IRCTC :  IRCTC రాత్రిపూట ప్రయాణించే ప్రయాణికుల కోసం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. తోటి ప్రయాణీకులకు ఇబ్బంది కలుగుతుందని కూడా చూడకుండా ఇష్టానుసారంగా వ్యవహరించేవారికి ఈ మార్గదర్శలు తప్పనిసరిగా వర్తిస్తాయి. ప్రయాణీకులు ప్రశాంతంగా ప్రయాణించటానికి..ముఖ్యంగా రాత్రి సమయాల్లో ప్రయాణించేవారికోసం IRCTC కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. ఇవి పాటించకపోతే జరిమానా తప్పదంటూ సూచనలు చేసింది.

ఈ నిబంధనల ప్రకారం..రాత్రి వేళల్లో రైలు బోగీలో ఏ ప్రయాణికుడు కూడా గట్టిగా మాట్లాడరాదు. స్పీకర్‌ పెట్టి (సెల్ ఫోన్లు) పాటలు వినకూడదు. ప్రయాణీకులతో పాటు రైల్వే ఎస్కార్టు, మెయింటెనెన్స్‌ స్టాఫ్‌ అయినా సరే గట్టిగా అరవకూడదు. అంతేకాదు..మిడిల్‌ బెర్త్‌ ప్రయాణికులు వారి బెర్త్‌పై రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నిద్రపోవచ్చని తెలిపింది.

ప్రయాణీకులకు కాకుండా టీసీకి కూడా ఈ మార్గదర్శలు పాటించాలని సూచిస్తూ.. రాత్రి 10 తర్వాత (రాత్రి 10 గంటల తర్వాత రైలు ఎక్కే ప్రయాణీకులకు చెల్లదు), టీటీఈ టికెట్‌ను తనిఖీ చేయరాదని..సీటు కేటాయించిన ప్రయాణికులు రాకపోతే..వెంటనే ఆ సీటు (బెర్త్)ని వెంటనే వేరే ప్రయాణీకులకు (రిజర్వేషన్ కన్ఫామ్ కాక ఆర్ఏసీ వచ్చినవారికి) కేటాయించకూడదు. ఆ సీటు కేటాయించిన వ్యక్తులు (ప్రయాణీకులు) రాకపోతే గంట తర్వాత లేదా రెండు స్టేషన్లు దాటాకనే (ఏది ముదు అయితే అది) వేరేవారికి టీటీఈ సీటు కేటాయించాలని సూచించింది. కుటుంబంలో ఒకరికి సీటు కన్ఫార్మ్‌ అయ్యి, ఇంకొకరికి కాకపోయినా.. కన్ఫార్మ్‌ అయిన వ్యక్తి ప్రయాణించకపోతే ఆ సీటులో టికెట్‌ కన్ఫార్మ్‌ కాని వ్యక్తి ప్రయాణించొచ్చని కూడా వెల్లడించింది.

ఈ నిబంధనలన్నీ ఇప్పటికీ వర్తింపజేయడంతో..ప్రభుత్వం దీనికి మరో నియమాన్ని జోడించింది. మీ సీటు, కంపార్ట్‌మెంట్ లేదా కోచ్‌లో ఉన్న ప్రయాణికులెవరూ మొబైల్‌లో బిగ్గరగా మాట్లాడకూడదు లేదా బిగ్గరగా సంగీతం వినకూడదు. ఇతర ప్రయాణికుల సౌకర్యార్థం..ప్రత్యేకించి సీనియర్ సిటిజన్ల సౌకర్యార్థం కొత్త నిబంధనను అమలు చేయాలని భావించింది.

రైలులో ప్రయాణిస్తున్నప్పుడు తమ కోచ్‌లలో పాటలు వింటూ బిగ్గరగా మాట్లాడుతున్నట్లుగా రైల్వే డిపార్ట్ మెంట్ కు అనేక ఫిర్యాదులు వచ్చాయి. రైల్వే ఎస్కార్ట్ లేదా మెయింటెనెన్స్ సిబ్బంది కూడా బిగ్గరగా మాట్లాడుతున్నారని కొన్ని ఫిర్యాదులు అందాయి. అలాగే ప్రయాణికులు రాత్రి 10 గంటల తర్వాత తమ (బెర్తుల వద్ద ఉన్న లైట్లు)లైట్లను ఆన్ చేసినట్లుగాను..కూడా ఫిర్యాదు అందాయి. దీంతో తోటి ప్రయాణీకులకు ఇబ్బంది కలిగించకూడదనే యోచనతో ఐఆర్టీసీ ఈ మార్గదర్శకాలను ప్రకటించింది. ప్రయాణికులు నిబంధనలను పాటించకపోతే వారిపై చర్యలు తీసుకుంటారు. జరిమానా విధిస్తారు.