IRCTC: ఇకపై బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ ధరలు పెరగనున్నాయ్

బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ లు ట్రైన్లలో ఉండి ఆర్డర్ ఇవ్వాలనుకుంటే ఇకపై కొత్త ఛార్జీలు తప్పవు. ట్రైన్ బుకింగ్ సమయంలో కాకుండా రైలులో ఉండి ఆర్డర్ ఇస్తే రూ.50 చెల్లించాల్సిందేనట. ప్రీమియం ట్రైన్లు అయిన శతాబ్ది ఎక్స్‌ప్రెస్, రాజధాని ఎక్స్‌ప్రెస్, వందే భారత్ ఎక్స్‌ప్రెస్, తేజాస్ ఎక్స్‌ప్రెస్, దురంతో ఎక్స్‌ప్రెస్ లలో కూడా న్యూ క్యాటరింగ్ ఛార్జెస్ మాత్రమే అమలవుతాయి.

IRCTC: ఇకపై బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ ధరలు పెరగనున్నాయ్

Irctc

 

 

IRCTC: బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ లు ట్రైన్లలో ఉండి ఆర్డర్ ఇవ్వాలనుకుంటే ఇకపై కొత్త ఛార్జీలు తప్పవు. ట్రైన్ బుకింగ్ సమయంలో కాకుండా రైలులో ఉండి ఆర్డర్ ఇస్తే రూ.50 చెల్లించాల్సిందేనట. ప్రీమియం ట్రైన్లు అయిన శతాబ్ది ఎక్స్‌ప్రెస్, రాజధాని ఎక్స్‌ప్రెస్, వందే భారత్ ఎక్స్‌ప్రెస్, తేజాస్ ఎక్స్‌ప్రెస్, దురంతో ఎక్స్‌ప్రెస్ లలో కూడా న్యూ క్యాటరింగ్ ఛార్జెస్ మాత్రమే అమలవుతాయి.

ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ రీసెంట్ గా నోటిఫికేషన్ రిలీజ్ చేసి.. అదనపు ఛార్జీ అయిన రూ.50కలుపుతున్నట్లు పేర్కొంది. మరోవైపు ట్రైన్ టికెట్ బుకింగ్ సమయంలో కాఫీ, టీ లాంటివి బుక్ చేసుకోకపోయినా అదనపు ఛార్జీలు ఉండవని చెప్పింది.

ప్రీమియం రైళ్లలో టీ, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఛార్జీలను రైల్వే బోర్డు నిర్దేశించింది. ప్రయాణీకులు తప్పనిసరిగా ధరలలో జీఎస్టీ మాత్రమే ఉంటుంది. ఇక అదనపు ఛార్జీలు ఏమీ ఉండవు.

Read Also: ఆలస్యంగా నడిచిన రైలు.. ఐఆర్‌సీటీసీ 4.5 ల‌క్ష‌ల ప‌రిహారం!

రాజధాని, దురంతో & శతాబ్ది ఎక్స్‌ప్రెస్ (2AC/3A/CC)
2AC/3A/CCలో ప్రయాణించే ప్రయాణికులు ఉదయం అల్పాహారం కోసం రూ. 105కి బదులుగా రూ. 155 చెల్లించాలి.
సాయంత్రం స్నాక్స్ కోసం రూ. 90కి బదులుగా రూ. 140
లంచ్ లేదా డిన్నర్ కోసం రూ. 185కి బదులుగా రూ. 235.

వందే భారత్:
వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించే వారు అల్పాహారం కోసం రూ. 155కి బదులుగా రూ. 205 చెల్లించాలి.
సాయంత్రం అల్పాహారం కోసం, రూ. 105కి బదులుగా రూ. 155
లంచ్ లేదా డిన్నర్ కోసం రూ. 244కి బదులుగా రూ. 294