భారతీయ నర్సులకు ప్రపంచవ్యాప్తంగా భారీ డిమాండ్..లక్షల్లో జీతాలు ఆఫర్

భారతీయ నర్సులకు ప్రపంచవ్యాప్తంగా భారీ డిమాండ్..లక్షల్లో జీతాలు ఆఫర్

Indian nurses గడిచిన కొన్ని దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా భారతీయ నర్సులు పనిచేస్తున్న విషయం తెలిసిందే. కొన్ని దేశాల్లోని వృద్ధాశ్రమాల్లో కూడా చాలామంది భారతీయ నర్సులు పనిచేస్తున్నారు. భారతీయ నర్సులు.. అధిక సహనం,షార్స్ స్కిల్స్,అంకితభావం,జాగ్రత్తగా చూసుకునే విధానం కలిగి ఉంటారన్న పేరు ఉంది. కరోనా వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుంచి భారతీయ నర్సులకు ప్రపంచవ్యాప్తంగా భారీగా డిమాండ్ పెరిగింది. అయితే,ప్రపంచదేశాలు ప్రస్తుతం వ్యాక్సినేషన్ ప్రారంభించడం మరియు భవిష్యత్తుల్లో వచ్చే మహమ్మారిలను తట్టుకునేలా తమ ఆరోగ్యవ్యవస్థలను సిద్దం చేసున్న క్రమంలో ఇప్పుడు భారతీయ నర్సుల డిమాండ్ రికార్డ్ స్థాయికి చేరుకుంది.

కరోనాకి ముందు,కేరళ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఓవర్సీస్ డెవలప్ మెంట్ అండ్ ఎంప్లాయిమెంట్ ప్రమోషన్ కన్సల్టెంట్స్(ODEPC)ప్రతినెలా దాదాపు 40మంది నర్సులను విదేశాలకు పంపించేది. అయితే గత నెలలో ఏకంగా 6రెట్లు అధికంగా 253మంది నర్సులను విదేశాలకు పంపింది. 253మంది నర్సులలో..యూఏఈకి ముఖ్యంగా దుబాయ్ కి 153 మందిని,బ్రిటన్ కి 50మంది,మిగిలిన 50మంది నర్సులను సౌదీ అరేబియా మరియు కొన్ని యూరప్ దేశాలకు పంపించినట్లు ODEPC ఎండీ అనూప్ తెలిపారు. వందల సంఖ్యలో ఇంకా నర్సులను రిక్రూట్ చేసుకున్నాయని,వీసా ఫెసిలిటీ అందుబాటులోకి రాగానే వీరందరూ విదేశాలకు వెళ్లేందుకు సిద్దంగా ఉన్నట్లు ఆయన తెలిపారు.

ODEPCతెలిపిన వివరాల ప్రకారం…గతంలో కూడా ఇప్పుడు దుబాయ్ నర్సుల కోసం ఎక్కువ జీతాన్ని ఆఫర్ చేస్తోంది. గతంలో దుబాయ్ లో 4,000-5,000దిరామ్స్(రూ.80,000-రూ.1లక్ష)వరకు నర్సులకు జీతం లభించేది. ఇప్పుడు 10,000-12,000(2-2.4లక్షలు)వరకు నర్సులకు జీతం లభిస్తోంది. భారతీయ నర్సులు కావాలని ఐర్లాండ్,మాల్టా,జర్మనీ,నెదర్లాండ్ మరియు బెల్జియం దేశాలు మన దేశాన్ని కోరుతున్నాయి. బెల్జియం..మొదటిసారిగా భారతీయ నర్సులను నియమించుకుంటోంది. దీనిపై చర్చలు నడుస్తున్నాయని,వారి ఆఫర్ చాలా ఎట్రాక్టివ్ గా ఉందని,కేవలం భాష సమ్యసనే తాము పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నామని అనూప్ తెలిపారు.