సీసీటీవీ వీడియోలు లీక్: జామియా అల్లర్లలో పోలీసులే విలన్లా!

సీసీటీవీ వీడియోలు లీక్: జామియా అల్లర్లలో పోలీసులే విలన్లా!

జామియా మిలియా ఇస్లామియా స్టూడెంట్స్‌పై పోలీసులే దాడి చేసినట్లు వీడియోలు లీక్ అయ్యాయి. డిసెంబర్ 15న జరిగిన ఈ ఘటనలో ఓల్డ్ రీడింగ్ హాల్‌లో చదువుకుంటున్న విద్యార్థులపై పోలీసులు లాఠీ చేశారు. ఢిల్లీ పోలీసులు హాల్‌లోకి ఎంటరై నేరుగా విద్యార్థులపై దాడి చేశారు. 

స్టూడెంట్స్‌ను కొట్టడమే కాకుండా ప్రొపర్టీని కూడా ధ్వంసం చేశారు. చదువుకునే వాళ్లు అక్కడి నుంచి వెళ్లేంత వరకూ దాడి చేశారు. ‘సీసీటీవీ ఫుటేజి పోలీసుల అకృత్యాన్ని బయటపెట్టింది. రాష్ట్ర ప్రభుత్వం తయారుచేస్తున్న టెర్రరిస్టులు వీళ్లు. పరీక్ష కోసం ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్‌పై ఎలా దాడి చేశారో చూడండి’ అంటూ జేసీసీ స్టేట్‌మెంట్ విడుదల చేసింది. 

ఈ వీడియోపై ఢిల్లీ పోలీసులు మాట్లాడుతూ.. ఈ కేసు ఆల్రెడీ క్రైమ్ బ్రాంచ్‌కు ట్రాన్సఫర్ అయింది. వీడియో సాక్ష్యం ఆధారంగా దర్యాప్తు చేపడుతున్నారని చెప్పుకొచ్చారు. డిసెంబరు 15న జామియా యూనివర్సిటీ అల్లర్లతో పోలీసులపై రాళ్లు విసురుకుంటూ, పబ్లిక్ బస్సులు, ప్రైవేట్ వాహనాలు ధ్వంసం చేసుకుంటూ యుద్ధ వాతావరణం నెలకొంది. 

ఈ వీడియోను కాంగ్రెస్ లీడర్ ప్రియాంక గాంధీ పోస్టు చేస్తూ.. తన అభిప్రాయం వెల్లడించారు. ‘ఢిల్లీ పోలీసులు విచక్షణ లేకుండా చదువుకుంటున్న విద్యార్థులపై ఎలా దాడి చేశారో చూడండి. ఓ స్టూడెంట్ పుస్తకాన్ని చూపిస్తుంటే అతణ్ని లాఠీతో కొడుతున్నాడు పోలీస్. హోం మంత్రి, ఢిల్లీ పోలీసులు లైబ్రరీలోకి వెళ్లి ఎవ్వరినీ గాయపరచలేదని అబద్ధం చెప్తున్నార’ ని కామెంట్ చేశారు. 

ఈ వీడియో చూశాక కూడా ప్రభుత్వం జామియా ఆందోళనలపై ఏ యాక్షన్ తీసుకోలేదంటే వారి ఉద్దేశ్యం ఏంటో దేశమంతా స్పష్టమవుతోంది. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ సైతం ఘటనపై తన గొంతు కలిపారు. ‘జామియా విద్యార్థులు ఎటువంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకపోయినా పోలీసులు దాడి చేశారు. చట్ట వ్యతిరేకంగా వ్యవహరించిన ఈ పోలీసులపై చర్యలు తీసుకోవాలి’ అని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.