జమ్మూ కశ్మీర్ లో 17వరకు లాక్ డౌన్ పొడిగింపు
J&K కరోనా రెండో దశ విజృంభణ నేపథ్యంలో జమ్ముకశ్మీర్లో లాక్డౌన్ను ఈ నెల 17 వరకు పొడిగించారు. మొత్తం 20 జిల్లాలకు ఇది వర్తిస్తుందని ఆదివారం అధికారులు తెలిపారు. కొత్త COVID-19 మార్గదర్శకాల ప్రకారం… జమ్మూ కాశ్మీర్లోయ అత్యవసర సేవలు మాత్రమే పనిచేయడానికి అనుమతించబడతాయి. వివాహ కార్యక్రమాలకు 25కి మించి అతిథులను ఆహ్వానించరాదు.
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జమ్ముకశ్మీర్లో తొలుత ఏప్రిల్ 29న 11 జిల్లాల్లో కర్ఫ్యూ విధించారు. అనంతరం ఈ నెల 3 నుంచి మొత్తం 20 జిల్లాల్లో లాక్డౌన్ అమలు చేస్తున్నారు. భద్రతా సిబ్బంది బారికేడ్లతో రోడ్లను మూసివేశారు. దీంతో 11 రోజులుగా అక్కడ సాధారణ జనజీవనం స్తంభించింది. మార్కెట్లు మూతపడగా, ప్రజా రవాణా కూడా నిలిచిపోయింది. అక్కడక్కడ ప్రైవేటు కార్లు మాత్రమే నడుస్తున్నాయి. మరోవైపు కరోనా పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో లాక్డౌన్ను మరో వారం రోజులు పొడిగించారు.