Jammu Bus Accident: జమ్మూకాశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. బ్రిడ్జిపై నుంచి బస్సు బోల్తా

జమ్మూకాశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు బ్రిడ్జిపై నుంచి లోతైన లోయలో పడిపోయింది. ఈ బస్సు అమృత్‌సర్ నుంచి జమ్మూకాశ్మీర్‌లోని కత్రాకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది.

Bus Accident: జమ్మూకాశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బ్రిడ్జిపై నుంచి బస్సు లోతైన లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. మరో 12 మందికి స్వల్ప గాయాలు అయ్యాయి. తీవ్రంగా గాయపడిన వారిని జమ్మూ ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. స్వల్పంగా గాయపడిన 12 మందిని స్థానిక పీహెచ్‌సీకి తరలించినట్లు సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ చందన్ కోహ్లి తెలిపారు.

Maharashtra Bus Accident: మహారాష్ట్రలో ఘోర బస్సు ప్రమాదం.. కాల్వలో పడటంతో 13 మంది మృతి

జమ్మూ – శ్రీనగర్ జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. బస్సు ప్రమాదం సమయంలో అందులో 70 మందికిపైగా ఉన్నారని తెలుస్తోంది. ఈ బస్సు అమృత్‌సర్ తగుసీ నుంచి జమ్మూకాశ్మీర్‌లోని  కత్రాకు వెళ్తుంది. రియాసి జిల్లాలోని కత్రాకు 15 కిలో మీటర్ల దూరంలో జజ్జర్ కోట్లి ప్రాంతానికి సమీపంలో బ్రిడ్జిపై నుంచి అదుపు తప్పి లోయలో పడినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదం విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు, స్థానికులు ఘటన స్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో ప్రమాద స్థలిలోనే ఏడుగురు మరణించారు. మరో వ్యక్తి ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలిస్తుండగా మృతిచెందాడు.

MS Dhoni: మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్ తీసుకుంటున్నారా? సీఎస్‌కే విజయం తరువాత ఏం చెప్పారంటే

పోలీసు వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. జమ్మూకి దాదాపు 30 కిలో మీటర్ల దూరంలో జజ్జర్ కోట్లి ప్రాంతంలో బస్సు ప్రమాదం జరిగింది. బస్సులో వైష్ణోదేవి ప్రయాణికులు కూడా ఉన్నారు. సీఆర్పీఎఫ్, పోలీస్, ఇతర బృందాలు ఘటన స్థలికి చేరుకొని అంబులెన్స్ సహాయంతో క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. క్రేన్ సహాయంతో బస్సును పక్కకు తొలగించి బస్సు కింద పడిపోయిన వారిని బయటకు తీశారు. బస్సు అమృత్ సర్ నుంచి వస్తోంది. దీనిలో బీహార్‌కు చెందిన వారుకూడా ఉన్నారని తెలిసిందని సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండర్ అశోక్ చౌదరి తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు