Love : ఇద్దరు పిల్లల తండ్రి.. పోలీస్‌తో ప్రేమాయణం.. గర్భం దాల్చడంతో

కర్ణాటకలోని మైసూరుకు చెందిన జేడీఎస్‌ నాయకుడు శివమూర్తి, జెడ్పీ మాజీ అధ్యక్షురాలు భాగ్య దంపతుల కుమారుడు ప్రదీప్‌(32) ఆత్మహత్య చేసుకున్నాడు.

Love : ఇద్దరు పిల్లల తండ్రి.. పోలీస్‌తో ప్రేమాయణం.. గర్భం దాల్చడంతో

Love (2)

Love : కర్ణాటకలోని మైసూరుకు చెందిన జేడీఎస్‌ నాయకుడు శివమూర్తి, జెడ్పీ మాజీ అధ్యక్షురాలు భాగ్య దంపతుల కుమారుడు ప్రదీప్‌(32) ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని తెలుస్తోంది. ప్రదీప్‌‌కు పెళ్లయి ఇద్దరు పిల్లలు ఉన్నారు. యితడు కుటుంబంతో కలిసి నగరంలోని మరటిక్యాతనహళ్లిలోని అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్నాడు. పోలీస్ శాఖలో పనిచేస్తున్న పెళ్లి కానీ యువతితో ప్రదీప్‌కి పరిచయం ఏర్పడింది.. పరిచయం కాస్త ప్రేమగా మారింది.

చదవండి : Love Story : సిల్వర్ స్క్రీన్‌తో పాటు స్మాల్ స్క్రీన్‌పై కూడా సత్తా చాటింది..

అయితే ఇటీవల ప్రియురాలికి గర్భం రావడంతో వివాహం చేసుకోవాలని ఒత్తిడి చేసింది. అప్పటికే పెళ్ళై ఇద్దరు పిల్లలు ఉన్న ప్రదీప్ పెళ్ళికి ఒప్పుకోలేదు. పెళ్లి విషయంలో యువతి ఒత్తిడి తెచ్చినట్లుగా తెలుస్తోంది. గురువారం సాయంత్రం ఆమెతో గొడవపడి ఫుటుగా మద్యం సేవించి ఇంటికి చేరిన ప్రదీప్.. ప్రేయసితో వీడియో కాల్ మాట్లాడాడు. ఈ నేపథ్యంలోనే వీరిద్దరి మధ్య మాటమాట పెరిగినట్లు తెలుస్తోంది.

చదవండి : Love : ప్రియురాలిని స్నేహితులకు ఇచ్చిన ప్రబుద్దుడు

క్షణికావేశంలో ప్రదీప్ తన గదిలోని ఫ్యాన్‌కి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు ప్రదీప్ ఫోన్ స్వాధీనం చేసుకొని కాల్ లిస్ట్ పరిశీలిస్తున్నట్లు సమాచారం.

చదవండి : Love : దూరం పెట్టాడని.. ప్రియుడిపై కాల్పులు జరిపిన ప్రియురాలు