J&K : కశ్మీరేతరులపై మరో ఉగ్రదాడి..ఇద్దరిని కాల్చి చంపిన టెర్రరిస్టులు
జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. గత వారంలో జమ్మూకశ్మీర్ లోని మైనార్టీలపై ముష్కరులు కాల్పులు జరిపిన నేపథ్యంలో
J&K జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. గత వారంలో జమ్మూకశ్మీర్ లోని మైనార్టీలపై ముష్కరులు కాల్పులు జరిపిన నేపథ్యంలో ఉగ్రవాదులు ఏరివేతను చేపట్టాయి బలగాలు. ఈ హత్యలకు పాల్పడిన ముగ్గురు ఉగ్రవాదులను 24 గంటల వ్యవధిలో హతమార్చినట్లు పోలీసులు ప్రకటించిన తర్వాత ముష్కరులు మరోమారు వరుస దాడులకు పాల్పడుతున్నారు.
ఆదివారం దక్షిణ కశ్మీర్లోని కుల్గాం జిల్లాలోని వాన్పో ప్రాంతంలో స్థానికేతర కూలీలే లక్ష్యంగా చేసుకుని ముష్కరులు దాడికి తెగబడ్డారు. ఇది జమ్మూకశ్మీర్ లో 24 గంటల వ్యవధిలో కశ్మీరేతరులపై జరిగిన మూడో దాడి కావడం ఆందోళనకరం. ఆదివారం వాన్పోలో వలస కార్మికులు ఉంటున్న ఇంట్లోకి ప్రవేశించిన ముష్కరులు వారిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు వలస కూలీలు మరణించగా.. ఒక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.
మృతులను బీహార్ కు చెందిన రాజా రేషి దేవ్, జోగిందర్ రేషి దేవ్గా గుర్తించారు. గాయపడ్డ మరో వ్యక్తిని చున్ రేశీ దాస్గా గుర్తించారు. గాయపడిన అతడిని హాస్పిటల్ కు తరలించారు. చున్ రేశీ దాస్ భుజం, వెన్నుకు గాయాలయ్యాయని, ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగా ఉందని జమ్మూకశ్మీర్ పోలీసులు తెలిపారు. కాల్పులకు తెగబడ్డ ఉగ్రవాదులను పట్టుకునేందుకు భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి తనిఖీలు నిర్వహిస్తున్నాయి.
ALSO READ పూంచ్- రాజౌరీలో ఏడో రోజుకి చేరిన సెర్చ్ ఆపరేషన్..ముగ్గురిని అదుపులోకి తీసుకున్న సైన్యం