Jharkhand : జాగింగ్ చేస్తుండగా జడ్జి దారుణ హత్య..

ఓ న్యాయమూర్తిని నడిరోడ్డుమీద అత్యంత దారుణంగా హత్య చేశారు. ఝార్ఖండ్ లోని ధన్ బాద్ లో ఓ జడ్జిని హత్య చేసిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. ఉత్తమ్ ఆనంద్ అనే న్యాయమూర్తి రోడ్డు ప్రమాదంలో మృతిగా మొదటి భావించగా అతను హత్య చేయబడినట్లుగా నిర్ధారణ అయ్యింది.

Jharkhand : జాగింగ్ చేస్తుండగా జడ్జి దారుణ హత్య..

Judge Murdered In Jharkhand (1)

Judge Murdered In Jharkhand : ఓ న్యాయమూర్తిని నడిరోడ్డుమీద అత్యంత దారుణంగా హత్య చేశారు. ఝార్ఖండ్ లోని ధన్ బాద్ లో ఓ జడ్జిని హత్య చేసిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. ఉత్తమ్ ఆనంద్ అనే న్యాయమూర్తి రోడ్డు ప్రమాదంలో మృతిగా మొదటి భావించగా అతను హత్య చేయబడినట్లుగా నిర్ధారణ అయ్యింది. రోడ్డు ప్రమాదంలో ఆయన మృతి చెందినట్టు మొదట వార్తలు వచ్చాయి. అయితే కావాలనే ఆయనను టెంపోతో ఢీ కొట్టి హత్య చేసినట్లుగా తెలుస్తోంది.ధన్ బాద్ లో ఉత్తమ్ ఆనంద్ అనే ఈ జడ్జి హఠాత్తుగా మరణించగా..రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్టు మొదట వార్తలు వచ్చాయి. కానీ ఆయనను ఎవరో కావాలనే ఆయనను టెంపోతో ఢీ కొట్టి..రోడ్డు యాక్సిడెంట్ లో ఆయన మరణించినట్టు క్రియేట్ చేసినట్లుగా పోలీసులు వారి విచారణలో నిర్ధారించారు. జడ్జిని టెంపోతో ఢీకొట్టినట్లుగా సీసీటీవీ ఫుటేజీలో స్పష్టంగా రికార్డు అయ్యింది. దీంతో ఆయన రోడ్డు ప్రమాదంలో కాదు హత్య చేయబడ్డారని పోలీసులు నిర్ధారించారు.

బుధవారం (జులై 28,2021) తెల్లవారు జామున 5 గంటల ప్రాంతంలో రోడ్డు పక్కగా జడ్జి ఉత్తమ్ ఆనంద్ జాగింగ్ చేస్తుండగా వేగంగా వచ్చిన ఓ టెంపో ఆయనను ఢీ కొట్టి వెళ్ళిపోయింది. రోడ్డంతా నిర్మానుష్యంగా ఉంది. అయినా ఆ టెంపో ఆయన్ని చంపాలనే ప్లాన్ తోనే వెనుకవైపు నుంచి ఢీ కొట్టినట్లుగా తెలుస్తోంది..టెంపో ఢీకొన్న వెంటనే ఆయన అక్కడికక్కడే కుప్ప కూలిపోయారు. సీసీటీవీ ఫుటేజీని క్షుణ్ణంగా పరిశీలించిన పోలీసులు దర్యాప్తు చేసి ఆ టెంపో డ్రైవర్ ను, మరో ఇద్దరినీ అరెస్టు చేయగా..జడ్జిని ఢీకొట్టిన టెంపో కూడా ఎక్కడో దొంగిలించి తీసుకొచ్చిందేనని పోలీసులు విచారణలో తేలింది. ఇది ముమ్మాటికి హత్యేనని పోలీసులు నిర్ధారించారు.

కాగా ధన్ బాద్ జిల్లాకోర్టు జడ్జి మృతి కేసును సుప్రీంకోర్టు తనకు తానుగా విచారించాలని ఈ కోర్టు బార్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. జడ్జి ఉత్తమ్ ఆనంద్ ను పక్కా ప్లాన్ ప్రకారంగా కుట్ర పన్ని హత్య చేశారని..ఓ న్యాయమూర్తి హత్య న్యాయ వ్యవస్థపై జరిగిన దాడేనని బార్ అసోసియేషన్ పేర్కొంది.కాగా..లాయర్లు పలు కేసులు వాదిస్తుంటారు. జడ్జీలు తీర్పులు చెబుతుంటారు. ఈక్రమంలో వారికి కొన్ని కేసుల్లో కొంతమంది శతృవులు కూడా ఏర్పడతారు. అలాగే జడ్జి ఉత్తమ్ ఆనంద్ విషయంలో కూడా అదే జరిగి ఉంటుందనీ..ఓ కేసులో ఉత్తమ్ బహుశా ప్రతివాదులకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చినందువల్ల ఆయనపై పగ తీర్చుకునే ఉద్దేశంతోనే ఈ హత్య జరిగినట్టుగా పోలీసులు భావిస్తున్నారు. ఈ క్రమంలో ఈ కేసును పోలీసులు సమగ్ర దర్యాప్తు కొనసాగిస్తున్నారు.