Kanhaiya Kumar : కాంగ్రెస్ లోకి కన్నయ్య,జిగ్నేష్!
సీపీఐ నేత, జేఎన్యూ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు కన్నయ్య కుమార్ గ్రెస్లో చేరడం దాదాపు ఖాయమైనట్లు తెలుస్తోంది.
Kanhaiya Kumar సీపీఐ నేత, జేఎన్యూ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు కన్నయ్య కుమార్ గ్రెస్లో చేరడం దాదాపు ఖాయమైనట్లు తెలుస్తోంది. మం గళవారం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని కన్నయ్య. కలిసి పార్టీలో చేరిక విషయం గురుంచి చర్చించినట్లు సమాచారం. యూపీ ఎన్నికలకు ముందు కన్నయ్య కుమార్ కాంగ్రెస్లో చేరితే .. పార్టీలో కొత్త ఉత్సాహం వస్తుందని కాంగ్రెస్ భావిస్తున్నట్లు సమాచారం.
కాగా, ఈ ఏడాది జనవరిలో హైదరాబాద్లో జరిగిన పార్టీ సమావేశంలో క్రమశిక్షణా రాహిత్యంగా వ్యవహరించారంటూ కన్నయ్యపై అభిశంసన తీర్మానం చేసింది సీపీఐ అధినాయకత్వం. దీంతో సీపీఐ అధినాయకత్వంపై అసంతృప్తిగా ఉన్న కన్నయ్య కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు, గత రెండేళ్లలో జ్యోతిరాదిత్య సింధియా, సుస్మితా దేవ్, జితిన్ ప్రసాద, ప్రియాంక చతుర్వేది లాంటి కీలక నేతలు పార్టీని వీడటం కాంగ్రెస్కు కోలుకోలేని దెబ్బగా పరిణమించింది. ఇలాంటి పరిస్థితుల్లో మంచి వక్తగా, ఫైర్ బ్రాండ్ నేతగా పేరున్న కన్నయ్య చేరిక.. పార్టీకి లాభిస్తుందని కాంగ్రెస్ నేతలు నమ్ముతున్నారు..కన్నయ్య పార్టీలో చేరితే వక్తగా అతడి నైపుణ్యాలను ఉత్తర్ ప్రదేశ్లోని పూర్వాంచల్ ప్రచారానికి వినియోగించుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది.
కన్నయ్య కాంగ్రెస్ లో చేరుతారని వస్తున్న వార్తలపై సీపీఐ కార్యదర్శి డి. రాజా స్పందిస్తూ ..ఈ నెల ప్రారంభంలో మా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశానికి కన్నయ్య హాజరై, చర్చలో పాల్గొన్నాడని మాత్రమే నేను చెప్పగలను అని అన్నారు.
మరోవైపు, గుజరాత్ ఇండిపెండెంట్ ఎమ్మెల్యే జిగ్నేష్ మేవాని కూడా కాంగ్రెస్ తో టచ్ లో ఉన్నట్లు సమాచారం. గత గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో మేవానిపై పోటీకి అభ్యర్థిని దింపకుండా కాంగ్రెస్ అతనికి పరోక్షంగా సహకరించిన విషయం తెలిసిందే.
READ UP Election : కాంగ్రెస్ సీఎం అభ్యర్థిగా ప్రియాంక గాంధీ ?