గంగానదిలో ప్రధాని మోడీ బోట్ రైడ్

  • Published By: veegamteam ,Published On : December 14, 2019 / 10:30 AM IST
గంగానదిలో ప్రధాని మోడీ బోట్ రైడ్

ప్రధాని నరేంద్ర మోడీ  పవిత్ర గంగానదిలో బోట్ రైడ్ చేశారు.  ఉత్తర్‌ప్రదేశ్ బీజేపీ సీనియర్ నేతలు..ఎన్డీఏ మిత్రపక్ష నేతలతో పాటు మోడీ గంగలో విహరించారు. యూపీ సీఎం  యోగీ ఆదిత్యనాథ్, ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్, బిహార్ డిప్యూటీ సీఎం సుశీల్ మోదీ గంగానదీలో పర్యటించారు. 

కాగా..ప్రధాని చంద్రశేఖర్ ఆజాద్ యూనివర్సిటీలో మోడీ అధ్యక్షతన నేషనల్ గంగా కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కూడా హాజరయ్యారు. సమావేశం తరువాత కేంద్రమంత్రులు, ఆయా రాష్ట్రాల సీఎంలు, ఉన్నతాధికారులతో కలిసి మోదీ బోట్‌రైడ్‌కు వెళ్లారు. మోదీ సర్కార్ నమామి గంగ ప్రాజెక్టు పేరిట గంగానది ప్రక్షాళన కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. గంగానది పరివాహక ప్రాంతాలైన పశ్చిమ బెంగాల్, ఝార్ఖండ్ రాష్ట్రాల సీఎంలు ఈ పర్యటనకు రాకపోవటం గమనించాల్సిన విషయం.