శ్రీలంక పేలుళ్లలో ఇద్దరు జేడీఎస్ కార్యకర్తలు మృతి
శ్రీలంక రాజధాని కొలంబోలో ఆదివారం (ఏప్రిల్ 21, 2019) ఉగ్రవాదులు జరిపిన బాంబు పేలుళ్లలో ఇద్దరు జేడీఎస్ పార్టీ కార్యకర్తలు చనిపోయారు. మరో ఐదుగురు కార్యకర్తల ఆచూకీ ఇప్పటికీ లేదు. వారి కోసం గాలిస్తున్నారు. క్షేమంగా ఉన్నారా లేదా అని కూడా ఇంకా తెలియరాలేదు. వారందరూ విహారయాత్ర కోసం కొలంబోకి వెళ్లారు. మిస్ అయిన ఏడుగురిలో హనుమతరాయప్ప, రంగప్ప చనిపోయినట్లు భారత రాజబార కార్యాలయం ప్రకటించింది. కర్నాటక ప్రభుత్వానికి సమాచారం ఇచ్చింది.
కనిపించకుండా పోయినవారి సమాచారం కోసం కొలంబోలోని ఇండియన్ హైకమిషన్ తో టచ్ లో ఉన్నానని కుమారస్వామి అన్నారు. శ్రీలంకలో జరిగిన వరస పేలుళ్లలో చనిపోయినవారిలో ఇప్పటివరకు ఐదుగురు భారతీయులను గుర్తించినట్లు అధికారులు కన్ఫర్మ్ చేశారు.
Karnataka CM HD Kumaraswamy: I’m shocked to hear that a 7-member team of JDS workers from Karnataka, who were touring Colombo(Sri Lanka), has gone missing after bomb blasts. 2 of them are feared killed. I’m in constant touch with Indian High Commission on reports of those missing pic.twitter.com/QHqSeMh9y0
— ANI (@ANI) April 22, 2019