ఓ వైపు కరోనా విజృంభణ..మరోవైపు బాధ్యతారాహిత్యంగా కర్ణాటక ఆరోగ్యశాఖ మంత్రి

  • Published By: venkaiahnaidu ,Published On : June 2, 2020 / 10:36 AM IST
ఓ వైపు కరోనా విజృంభణ..మరోవైపు బాధ్యతారాహిత్యంగా కర్ణాటక ఆరోగ్యశాఖ మంత్రి

కర్ణాటకలో కరోనా విజృంభణ కొనసాగుతున్న ఈ సమయంలో ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారు. చిత్రదుర్గలో ఇవాళ ఓ ఊరేగింపులో ఆరోగ్యశాఖ మంత్రి బీ శ్రీరాములు పాల్గొన్నారు.  అయితే ఈ కార్యక్రమంలో కరోనా నియంత్రణ కోసం ప్రభుత్వం నిర్దేశించిన సోషల్ డిస్టెన్స్,మాస్క్ ధరించడం వంటి నిబంధనలు అక్కడున్న ఎవ్వరూ పాటించలేదు.

ఆరోగ్యశాఖా మంత్రి నిలబడి ఉన్న వాహనం చుట్టూ ఎలాంటి నిబంధనలు పాటించకుండా పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడారు. బత్తాయిలు,ఆపిల్ పండ్లతో కూడిన గజమాలతో  మంత్రిగారిని సత్కరించారు. అయితే మంత్రిగారు కూడా అక్కడున్న వారిని హెచ్చరించే ప్రయత్నం చేయకుండా జనం జేజేలు కొడుతుంటే సమస్కరిస్తూ అలాగే ఉండిపోయారు. ఓవైపు కర్ణాటకలో కరోనా కేసుల సంఖ్య 3,500కు చేరువలో ఉన్న సమయంలో ఇలాంటి సంఘటనలు ఇప్పుడు మరింత ఆందోళన కలిగించేదిగా ఉంది.

Read:  వలస కూలీలకు ఉచితంగా కండోమ్ లు పంపిణీ చేస్తున్న ప్రభుత్వం