Karnataka: ‘కర్ణాటక హోం మినిష్టర్ పిచ్చి పట్టిన వ్యక్తి’
కర్ణాటక హోం మంత్రి అరగ జ్ఞానేంద్రను పిచ్చివాడంటూ విమర్శలు గుప్పించారు రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్. అతనొక పిచ్చోడు మెంటల్ హాస్పిటల్ కు పంపాలి....
Karnataka: కర్ణాటక హోం మంత్రి అరగ జ్ఞానేంద్రను పిచ్చివాడంటూ విమర్శలు గుప్పించారు రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్. అతనొక పిచ్చోడు మెంటల్ హాస్పిటల్ కు పంపాలి. కర్ణాటకలో బిట్ కాయిన్ స్కాంలో ఇన్వాల్వ్ అయి ఉన్నాడనే ప్రశ్నలకు ఈ విధంగా బదులిచ్చారు.
‘హోం మంత్రి పిచ్చి పట్టిన వ్యక్తి. చెకింగ్ కోసం నిమిహాన్స్ అనే పిచ్చాసుపత్రికి పంపించాలి. అతను రాసిన లేఖను ముందుగా సుమోటాగా గుర్తించండి’ అని కామెంట్ చేశారు. హోం మంత్రి జ్ఞానేంద్ర.. యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఆన్ లైన్ ఓటింగ్ వేసే క్రమంలో హ్యాక్ అయినట్లు తెలిసిందని అన్నారు.
‘ఇంటర్వ్యూలో.. కర్ణాటకలో బిట్ కాయిన్ స్కాం బయటకు రాగానే.. ఈ విషయం తెరమీదకు వచ్చింది. చాలా మంది కాంగ్రెస్ కార్యకర్తలు యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఓటు హ్యాక్ అయినట్లు నాకు చెప్పారు. విచారణ చేపట్టాలని కోరారు’
…………………………………..: ఓటీటీలో వచ్చేసిన మరో రెండు సినిమాలు..!
కర్ణాటకకు చెందిన హ్యాకర్ శ్రీకృష్ణ అలియాస్ శ్రీకి నుంచి ఇటీవల రూ.9కోట్ల విలువైన బిట్ కాయిన్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంతో అధికార పార్టీకి చెందిన కొందరు కీలక నేతల ప్రమేయం ఉందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఈ వ్యక్తి గతంలో డార్క్ నెట్ ద్వారా ప్రభుత్వానికి చెందిన పోర్టల్స్ వంటివి కూడా హ్యాక్ చేసినట్లు రికార్డుల్లో ఉంది.
The HM is a mad man & should be sent to NIMHANS (National Institute of Mental Health & Neurosciences) for checking. Let him first take suo moto cognizance of the letter written to PM (on bitcoin scam) featuring names of various BJP leaders: Karnataka Congress chief DK Shivakumar pic.twitter.com/gdQNuqJLkZ
— ANI (@ANI) November 18, 2021