క్రికెట్ లోను కత్రినా కత్తే : కోహ్లీకి రికమెండ్ చేయమంటోంది
ముంబై : బాలీవుడ్ భామ కత్రినా కైఫ్ క్రికెటర్ అవతారం ఎత్తింది. సినిమాలలో బిజీ బిజీగా వుండే కత్రినా కైఫ్ క్రికెట్ ఆడటమేకాదు బాల్ ను బౌండరీలు దాటించింది. కత్రినా క్రికెట్ ఆట తీరు చూసిన గ్రౌండ్లో ఉన్నవాళ్లందరు కత్రినా బ్యాటింగ్ తీరు చూసి మురిసిపోయారు. దీనికి సంబంధించిన వీడియోని కత్రినా తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది., అంతేకాదు వరల్డ్ కప్ టీంలో తనని ఎంపిక చేయమని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మని కోరింది.
కత్రినా కైఫ్ ప్రస్తుతం భారత్ అనే చిత్రంతో బిజీగా ఉన్న కత్రినా కైఫ్ రీసెంట్గా జీరో అనే చిత్రంతో ప్రేక్షకులను అలరించింది. ఇందులో అనుష్క శర్మ కూడా కీలక పాత్ర పోషించింది. ఈ క్రమంలో తాను నటిస్తున్న భారత్ మూవీకి ప్యాకప్ చెప్పగానే అందరితో కలిసి క్రికెట్ ఆడింది. ఈ వీడియోను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తూ జీరో కోస్టార్ అనుష్క శర్మకి మెసేజ్ ఇచ్చింది నా బ్యాటింగ్ తీరు చూసి వరల్డ్ కప్లో ఆడే అవకాశం ఇవ్వమని విరాట్ కోహ్లీకి రికమెండ్ చేయమని..నేను ప్రాక్టీస్లో బిజీగా వున్నాననీ..మంచి ఆల్ రౌండర్గా జట్టులో ఆడేందుకు సిద్ధంగా వున్నానంటు ఫన్నీ కామెంట్ పెట్టింది కత్రినా. ప్రస్తుతం కత్రినా క్రికెట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.