కరోనా సమయంలో నిరాడంబరంగా కేరళ సీఎం కుమార్తె పెళ్లి
కేరళ సీఎం పినరయి విజయన్ కుమార్తె వీణ వివాహం సోమవారం జరిగింది. తిరువనంతపురంలోని ముఖ్యమంత్రి అధికారిక నివాసం క్లిఫ్ హౌస్లో అతికొద్ది మంది అతిథుల సమక్షంలో సీఎం అధికారిక నివాసంలో సాదాసీదాగా పెళ్లితంతు జరిపించారు. కరోనా నేపథ్యంలో నిబంధనలకు అనుగుణంగానే జరిగిన ఈ వివాహానికి పలువురు రాజకీయ నేతలు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు.
డెమొక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(డీవైఎఫ్ఐ) జాతీయ అధ్యక్షుడు, సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు మహమ్మద్ రియాజ్ను వీణ పరిణయమాడారు. విశ్రాంత ఎస్పీ పీ.ఎం అబ్దుల్ ఖాదర్ కుమారుడు రియాజ్. సీపీఎం అనుబంధ సంస్థ ఎస్ఎఫ్ఐ ద్వారా రియాజ్ రాజకీయ జీవితం ప్రారంభించారు. రియాజ్ 2009 ఎన్నికల్లో కోజికోడ్ లోక్సభా స్థానానికి పోటీచేసి, కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఓడిపోయాడు. 2017లో డీవైఎఫ్ఐ జాతీయ అధ్యక్షుడిగా రియాజ్ బాధ్యతలు తీసుకున్నారు.
వీణ.. ఐటీ రంగంలో రాణిస్తున్నారు. ఒరాకిల్లో కన్సల్టెంట్గా, ఆర్పీ టెక్సాఫ్ట్ ఇంటర్నేషనల్ సీఈఓగా వ్యవహరించారు. ప్రస్తుతం బెంగళూరు ప్రధాన కార్యాలయంగా ఉన్న ఎక్సాలాజిక్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్కు మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నారు.
కాగా, ఇది వారిద్దరికీ ఇది రెండో వివాహం. రియాజ్ తన మొదటి భార్యతో, వీణ తన మొదటి భర్తతో విడాకులు తీసుకున్నారు. రియాజ్కు ఇద్దరు పిల్లలు, వీణకు ఒక కొడుకు ఉన్నారు.