Kerala Man: భార్యతో గొడవ.. పోలీసు జీపు నుంచి దూకి మృతి చెందిన భర్త

కస్టడీలో ఉన్న వ్యక్తి పోలీసు జీపులో నుంచి దూకి ప్రాణాలు తీసుకున్నాడు. ఈ కేసుపై సమగ్ర విచారణ జరిపించాలని రాష్ట్ర మంత్రి వీ శివన్ కుట్టి పోలీసులను ఆదేశించారు. భర్త తమ ఇంటికి వచ్చి..

Kerala Man: భార్యతో గొడవ.. పోలీసు జీపు నుంచి దూకి మృతి చెందిన భర్త

Police Jeep

Kerala Man: కస్టడీలో ఉన్న వ్యక్తి పోలీసు జీపులో నుంచి దూకి ప్రాణాలు తీసుకున్నాడు. ఈ కేసుపై సమగ్ర విచారణ జరిపించాలని రాష్ట్ర మంత్రి వీ శివన్ కుట్టి పోలీసులను ఆదేశించారు.

భర్త తమ ఇంటికి వచ్చి గొడవ చేస్తున్నాడంటూ మహిళ కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు ఇన్వాల్వ్ అయ్యారు. మార్చి 16న భార్యాభర్తలిద్దరినీ స్టేషన్ కు పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చిపంపించారు. మరోసారి అలా జరగకూడదని పంపించిన అదే రోజు రాత్రి పోలీసులకు మళ్లీ ఫోన్ వచ్చింది.

తన భర్త బాగా తాగి గాయాలతో ఇంటికొచ్చాడంటూ చెప్పిందామె.

Read Also : విడాకులు కోరిన భార్యను విచక్షణా రహితంగా కత్తితో పొడిచిన భర్త

‘మళ్లీ అతని ఇంటికి వెళ్లి గాయాలకు చికిత్స కోసం హాస్పిటల్ కు తీసుకెళ్లాం. హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొస్తుండగా అతని భార్య, ఆమె సోదరుడు లోనికి అనుమతించలేదు. తీవ్ర గాయాలతో ఉన్న వ్యక్తిని వదిలేయడం ఇష్టం లేక పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లాం. ఆ తర్వాత రొటీన్ చెకప్ కోసం హాస్పిటల్ కు తీసుకెళ్తుండగా జీపులో నుంచి దూకేశాడు. దీంతో అతనికి తీవ్రగాయాలయ్యాయి’ అని పోలీసు అధికారి వెల్లడించారు.

గాయాలతో ఉన్న అతణ్ని హాస్పిటల్ లో అడ్మిట్ చేయగా అక్కడే మృతి చెందాడని పోలీసులు అంటున్నారు.