Kerala: రూ.300లాటరీ టిక్కెట్‌తో రూ.12కోట్లు గెలిచిన పెయింటర్

క్రిష్టమస్ పండుగ రోజు ఆ పెయింటర్ జీవితాల్లో వెలుగులు నింపింది లాటరీ టిక్కెట్. ఊహించనంత ప్రైజ్ మనీ దక్కింది ఆ బంపర్ లాటరీ ప్రైజ్‌తో. యెమనంకు సమీపంలోని కుడయంపడి గ్రామంలో సదానందన్...

Kerala: రూ.300లాటరీ టిక్కెట్‌తో రూ.12కోట్లు గెలిచిన పెయింటర్

Lottery Ticket

Kerala: క్రిష్టమస్ పండుగ రోజు ఆ పెయింటర్ జీవితాల్లో వెలుగులు నింపింది లాటరీ టిక్కెట్. ఊహించనంత ప్రైజ్ మనీ దక్కింది ఆ బంపర్ లాటరీ ప్రైజ్‌తో. యెమనంకు సమీపంలోని కుడయంపడి గ్రామంలో సదానందన్ కొనుగోలు చేసిన లాటరీ టికెట్ లో ఫస్ట్ ప్రైజ్ దక్కించుకున్నాడు.

‘లాటరీ టిక్కెట్ అమ్మిన సెల్వన్ నుంచి ఆదివారం ఉదయం ఫోన్ వచ్చింది. టికెట్ కొన్న తర్వాత మాంసం కొనుగోలుచేసేందుకు మార్కెట్ వరకూ వెళ్లినప్పుడు ఫోన్ వచ్చింది’ అని చెప్తున్నాడు ఆ యాబై ఏళ్ల పెయింటర్.

వచ్చిన డబ్బును తన పిల్లల భవిష్యత్ కోసం ఖర్చుపెడతానని చెప్తున్నాడు. రూ.300తో కొనుగోలుచేసిన లాటరీ టికెట్ ఫస్ట్ ప్రైజ్ రూ.12కోట్లు కాగా, రెండో ప్రైజ్ విలువ రూ.3కోట్లు, మూడో ప్రైప్ విలువ రూ.60లక్షలు (ఆరుగురికి ఇస్తారు)

ఇది కూడా చదవండి : ఉబెర్ డ్రైవర్‌కు రూ. 75 లక్షల లాటరీ!
స్థానిక మీడియా కథనం ప్రకారం.. లాటరీ డిపార్ట్‌మెంట్ మొత్తం 24లక్షల టికెట్స్ ప్రింట్ చేసింది. గతేడాది సెప్టెంబర్ 2021లో కేరళలోని ఓనమ్ కు చెందిన ఆటో డ్రైవర్ రూ.12కోట్లు గెలుచుకున్నాడు.