Covishield: కొవీషీల్డ్ తీసుకున్న పీజీ విద్యార్థి మృతి.. రూ.10కోట్లు నష్టపరిహారం కోరుతున్న తల్లిదండ్రులు

సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారుచేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ను తప్పనిసరి చేయడం వల్లే తమ కుమార్తె చనిపోయిందని ఆరోపిస్తూ పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థి తల్లిదండ్రులు శుక్రవారం..

Covishield: కొవీషీల్డ్ తీసుకున్న పీజీ విద్యార్థి మృతి.. రూ.10కోట్లు నష్టపరిహారం కోరుతున్న తల్లిదండ్రులు

Covieshield

Covishield: సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారుచేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ను తప్పనిసరి చేయడం వల్లే తమ కుమార్తె చనిపోయిందని ఆరోపిస్తూ పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థి తల్లిదండ్రులు శుక్రవారం కేరళ హైకోర్టును ఆశ్రయించారు. సీరం తయారీదారులను బాధ్యులను చేస్తూ.. తమ కుమార్తె మృతికి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం రూ.1 కోటి పరిహారం ఇవ్వాలని కోరుతున్నారు.

తిట్టాకు చెందిన సాబు సి థామస్, అతని భార్య జీన్ జార్జ్ దాఖలు చేసిన పిటిషన్ ప్రకారం.. నోవా సాబు అనే ఎంఏ లిటరేచర్ విద్యార్థినికి కొచ్చిలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో కోవిషీల్డ్‌ వ్యాక్సిన్ వేశారు. తర్వాతి రోజే అస్వస్థతకు గురి కావడంతో నోవాను ఆసుపత్రికి తీసుకెళ్లామని తలనొప్పి, జ్వరంతో చికిత్స అందించారంటూ పిటిషన్‌లో పేర్కొంది.

తర్వాతి చికిత్స నిమిత్తం మరో ఆసుపత్రికి బదిలీ చేయడంతో ఆమెలో ప్రతిస్పందనలు తగ్గిపోయాయి. అలసట, తలనొప్పి, వాంతులు వచ్చి.. కొద్దిసేపటికే అపస్మారక స్థితికి చేరుకుంది. అనంతరం ఆమెకు ఇంట్యూబేషన్ చేసి వెంటిలేటర్‌పై ఉంచారు. నోవా ఆగస్టు 12, 2021న ఇంట్రాసెరెబ్రల్ బ్లీడింగ్‌తో మృతి చెందింది.

Read Also: కొవీషీల్డ్ పూర్తి తీసుకుంటే ఏడు నెలలకే యాంటీబాడీలు..

పిటిషనర్లు మొదట మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేసి.. ఆ తర్వాత పరిహారం కోరుతూ, పతనంతిట్ట జిల్లా వైద్యాధికారి విచారణ చేపట్టారు.

వ్యాక్సినేషన్‌కు ముందు నోవా సాబుకు నాడీ సంబంధిత వ్యాధి ఉన్నట్లుగా ఎలాంటి ఆధారాలు లేవని దర్యాప్తులో స్పష్టమైంది. కోవిషీల్డ్ వ్యాక్సిన్ మొదటి డోస్ తీసుకున్న కొద్దిసేపటికే నోవాలో సమస్యలు మొదలయ్యాయి.

కోవిషీల్డ్ టీకా సమస్యల కారణంగానే తమ కుమార్తె చనిపోయిందని, ప్రభుత్వం మరియు తయారీ సంస్థ బాధ్యత వహించి వారికి పరిహారం చెల్లించాల్సిన బాధ్యత ఉందని కూడా పిటిషనర్లు ప్రకటించాలని కోరారు. ఈ పిటిషన్ శుక్రవారం విచారణకు రాగా.. జస్టిస్ ఎన్.నగరేష్ ఈ పిటిషన్‌పై కేంద్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని కోరారు.