సైకిల్‌ను బైక్‌‌లా మార్చేసిన యువకుడు..లాక్‌డౌన్ టైమ్‌లో ప్రతిభకు పదును

  • Published By: nagamani ,Published On : June 12, 2020 / 09:24 AM IST
సైకిల్‌ను బైక్‌‌లా మార్చేసిన యువకుడు..లాక్‌డౌన్ టైమ్‌లో ప్రతిభకు పదును

లాక్ డౌన్ సమయాన్ని చాలామంది చక్కగా సద్వినియోగం చేసుకుంటున్నారు.వారిలో ఉండే ప్రతిభను వెలికి తీస్తున్నారు.అటువంటి వాడే  కేరళలోని కోచికి చెందిన అర్షద్ అనే విద్యార్థి.

తన సైకిల్‌ను ఏకంగా బైకులా మార్చేసుకున్నాడు. తన తాత పాత స్కూటీలోని 50సీసీ ఇంజిన్‌తో సైకిల్ ను బైక్ లాగా మార్చేశాడు. సైకిల్ సీటు, పెడల్స్‌ను అలాగే ఉంచేసి.. ఇంజిన్ మార్చాడు. తన తెలివికి పనిపెడుతూ కొన్ని మార్పులు చేర్పులు చేశాడు.

ఈ బైకుపై లీటర్ పెట్రోల్‌కు 50 కిమీలు ప్రయాణించవచ్చని తెలిపాడు.ఆటోమొబైల్ ఇంజనీర్ కావాలని అర్షద్ లక్ష్యం నెరవేరాలని కోరుకుందాం. మేకిన్ ఇండియా ఇటువంటివారితోనే సాధ్యమవుతుందని ఆశిద్దాం.

Read: లాక్‌డౌన్ టైమ్‌లో కంపెనీలు పూర్తి జీతం చెల్లించకపోవడంపై సుప్రీంకోర్టు తీర్పు