Sexually Assaulting : విద్యార్థినులపై లైంగిక వేధింపులు..50 ఏళ్ల మాస్టారికి 79 ఏళ్ల జైలుశిక్ష

4,5 తరగతులు చదివే విద్యార్ధినులపై మాస్టారు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో కోర్టు 79 ఏళ్లు జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది.

Sexually Assaulting : విద్యార్థినులపై లైంగిక వేధింపులు..50 ఏళ్ల మాస్టారికి 79 ఏళ్ల జైలుశిక్ష

Kerala 50 years old Teacher gets 79 years in jail : పిల్లలకు పాఠాలు చెప్పటంతో పాటు సమాజంలో ఉండే మంచి చెడులను గురించి..చెప్పాల్సిన మాస్టారే విద్యార్థినులపై తీవ్రమైన లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ముక్కుపచ్చలారని చిన్నారులపై కామపు కన్నేశాడు. సాక్షాత్తు సరస్వతీ దేవి నిలయమైన క్లాసు రూములోనే 4,5 తరగతులు చదివే నలుగురు చిన్నారులపై లైంగిక వేధింపులు చేశాడు. సదరు కీచక టీచర్ పై వచ్చినవి కేవలం ఆరోపణలు కాదని న్యాయస్థానంలో రుజువైంది. దీంతో న్యాయస్థానం 50 ఏళ్ల కీచక మాస్టారికి 79 ఏళ్ల జైలుశిక్ష విధిస్తు తీర్పు చెప్పింది.

కేరళలోని తాలిపరంబ ఫాస్ట్ ట్రాక్ పోస్కో కోర్టు నిందితుడు పీఈ గోవిందన్ నంబూద్రికి 79 ఏళ్ల కఠిన కారాగార జైలు శిక్ష విధిస్తు.. తీర్పు ప్రకటించింది. అంతేకాదు రూ.2.7 లక్షల జిరిమానా కూడా విధిస్తూ..న్యాయమూర్తి ముజీబ్ రెహమాన్ ఆదేశాలు జారీ చేశారు. కన్నూరులోని అలప్పడంబు సమీపంలోని లోయర్ ప్రైమరీ స్కూల్లో 4, 5వ తరగతులకు చెందిన నలుగురు విద్యార్థినులపై లెక్కల మాస్టార్ నంబూద్రి తరచుగా లైంగిక వేధింపులకు చేసినట్లు పోలీసులు అభియోగాలు మోపారు.

2013 జూన్ నుంచి 2014 ఫిబ్రవరి మధ్య అతడు చేసిన ఈ దారుణాలు బయటకు వచ్చాయి.క్లాసు రూములో పిల్లలు పాఠం అర్థం కాక మాస్టారిని తమకొచ్చిన అనుమానాలను అడుగగా దాన్ని ఆసరా చేసుకున్న ఈ మాస్టారు విద్యార్ధినులపై లైంగిక చర్యలకు పాల్పడినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. దీనికి సంబంధించి అన్ని సాక్ష్యాధారాలముజీబ్ రెహమాన్ 79 సంవత్సరాల జైలుశిక్షతో పాటు రూ.2.7 లక్షల జరిమానా విధిస్తు తీర్పు వెలువరించారు.