Congress Party : కీలక మార్పులకు శ్రీకారం చుట్టిన కాంగ్రెస్
ఒక కుటుంబంలో మరొకరు కూడా రాజకీయంగా కొనసాగుతూ ఉంటే... ఐదేళ్లు పాటు పార్టీ కోసం సంస్థాగతంగా పని చేయాలనే నిబంధన పెట్టినట్లు తెలిపారు. ఆ తర్వాతే టికెట్ పొందేందుకు అర్హులు అని పేర్కొన్నారు.

Congress party : పార్టీ సంస్థాగత వ్యవహారాల్లో కాంగ్రెస్ కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. సంస్థాగత వ్యవహారాలపై ఏర్పాటైన కమిటి చేసిన సిఫారసులకు సిడబ్ల్యూసి ఆమోదం తెలిపింది. సంస్థాగత అంశాలకు సంబంధించిన ఉదయ్పూర్ డిక్లరేషన్ వివరాలను అజయ్ మాకెన్ వెల్లడించారు. రానున్న ఆరు నెలల్లో బ్లాక్ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను పూర్తి చేయనున్నట్లు తెలిపారు. పార్టీని సమర్ధవంతంగా నిర్వహించేందుకు బ్లాక్ కాంగ్రెస్తోపాటు మండల కాంగ్రెస్ కమిటీలు కూడా ఏర్పాటు చేయాలన్నారు. జాతీయ స్థాయిలో మూడు కొత్త కమిటీలు ఏర్పాటు చేయాలని తెలిపారు. ప్రజా అంతర్దృష్టి విభాగం… విధాన రూపకల్పన కోసం… దీని ద్వారా ప్రజల అభిప్రాయాలు తెలుసుకుంటారని చెప్పారు.
జాతీయ శిక్షణా సంస్థ ఏర్పాటు… పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వ విధానాలు, ప్రజా సమస్యలపై సమగ్ర శిక్షణ కోసం కొత్త సంస్థ ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కేరళలోని రాజీవ్ గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డెవలప్మెంట్ స్టడీస్ నుంచి సంస్థ ప్రారంభం కానుందని చెప్పారు. ఎఐసిసి స్థాయిలో ఎన్నికల నిర్వహణ విభాగం ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రతి ఎన్నికల్లో…. మెరుగైన ఫలితాలు సాధించేందుకు కొత్త విభాగం ఉపయోగపడనుందని వెల్లడించారు. పార్టీ వ్యవహారాల ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఎఐసిసి నుంచి జిల్లా స్థాయి వరకు ఆఫీస్ బేరర్ల పనితీరును ఎప్పటికప్పుడు పరిశీలించాలన చేస్తామని చెప్పారు.
Sonia Gandhi : కన్యాకుమారి నుంచి కాశ్మీర్కు..’భారత్ జోడో యాత్ర’ : సోనియా గాంధీ
ఉత్తమ పనితీరు కనబరిచే వారికి పదోన్నతి, పని చేయని వారికి ఉద్వాసన పలకాలని నిర్ణయించామని తెలిపారు. ఒక వ్యక్తి ఐదేళ్లకు మించి పదవిలో కొనసాగడంపై కాంగ్రెస్ కీలక నిర్ణయం ప్రకటించింది. 50 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్నవారు పార్టీలోని అన్ని విభాగాల్లో 50 శాతం ఉండాలని నిర్ణయించినట్లు తెలిపారు. మండల స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు… ఎస్సీ, ఎస్టి, ఓబిసి, మైనారిటీలకు సమాన ప్రాతినిధ్యం కల్పించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఒక కుటుంబానికి ఒకే టికెట్ నిబంధనను కాంగ్రెస్ అమల్లోకి తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు.
ఒక కుటుంబంలో మరొకరు కూడా రాజకీయంగా కొనసాగుతూ ఉంటే… ఐదేళ్లు పాటు పార్టీ కోసం సంస్థాగతంగా పని చేయాలనే నిబంధన పెట్టినట్లు తెలిపారు. ఆ తర్వాతే టికెట్ పొందేందుకు అర్హులు అని పేర్కొన్నారు. ఈశాన్య ప్రాంతాల కోసం ఏర్పాటైన… నార్త్ఈస్ట్ సమన్వయ కమిటి ఛైర్మన్ సిడబ్ల్యూసికి శాశ్వత ఆహ్వానితుడిగా మార్పు చేసినట్లుగా తెలిపారు. జాతీయ స్థాయిలో సిడబ్ల్యూసి స్థాయిలో పార్టీ అధ్యక్షుడికి సహాయకారిగా ఉండేలా… ఒక ప్రత్యేక కమిటి ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రతి స్థాయిలో… ఒక రాజకీయ వ్యవహారాల కమిటి ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. సంవత్సరానికి ఒక సారి ఎఐసిసి స్థాయి నుంచి బ్లాక్ స్థాయి వరకు విస్తృత సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వివరించారు.
1IndVsEng 5th Test Rain : మళ్లీ ఆగిన ఆట.. భారత్, ఇంగ్లండ్ టెస్టుకు వరుణుడి ఆటంకం
2Viral Video : ఆలయంలో అద్భుతం.. శివలింగంపై మంచు.. మహాశివుని మహిమే.. వీడియో!
3Telangana Covid : తెలంగాణలో కరోనా టెర్రర్.. భారీగా పెరిగిన కొత్త కేసులు
4TRS BJP Flexi War : మెట్రో పిల్లర్లకు ఉన్న సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలపై ప్రధాని మోదీ బ్యానర్లు
5TTD EO DharmaReddy : ప్రకృతి వ్యవసాయ రైతుల నుండి 12 రకాల ఉత్పత్తుల సేకరణ-టీటీడీ ఈవో
6Diabetics Control : షుగర్ తగ్గాలంటే.. ఇవి తినాల్సిందే..!
7Pawan Kalyan : బీజేపీ ఈ పొజిషన్కి రావడానికి 20ఏళ్లు పట్టింది- పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు
8YS Jagan : డియర్ హర్షా… గర్వంగా ఉంది.. కుమార్తె మాస్టర్స్ డిగ్రీపై జగన్ ట్వీట్!
9Metro Trains : రేపు సాధారణంగానే మెట్రో రైళ్లు నడుస్తాయి : ఎండీ ఎన్వీఎస్ రెడ్డి
10Bumrah World Record : టెస్ట్ క్రికెట్ లో బుమ్రా వరల్డ్ రికార్డు
-
Massive Earthquake : దక్షిణ ఇరాన్లో భారీ భూకంపం.. యూఏఈలోనూ ప్రకంపనలు!
-
Pawan Kalyan : కులాలను విడగొట్టడం కాదు..కలిపే విధానం ఉండాలి : పవన్ కళ్యాణ్
-
BJP Meetings : బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో కీలక నిర్ణయాలు..తెలంగాణపై ప్రత్యేక తీర్మానం
-
India Railway Alert : రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. ఆగస్టు 1 నుంచి కొత్త నిబంధనలు..!
-
Rajamouli: జక్కన్న సెంటిమెంట్.. మహేష్ను కూడా వదలడా..?
-
Khushbu : ప్రధాని మోదీని చూసి కేసీఆర్ భయపడుతున్నారు : ఖుష్బూ
-
Modi Tweet Telugu : తెలుగులో ట్వీట్ చేసిన ప్రధాని మోదీ
-
Prabhas: ప్రభాస్ ఫ్యాన్స్లో టెన్షన్.. ఎందుకో తెలుసా?